News November 17, 2024

BGT ఆ జట్టే గెలుస్తుంది: హేడెన్

image

ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే BGT సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ జోస్యం చెప్పారు. కోహ్లీ, స్మిత్ వారి జట్లకు కీలకంగా మారతారని చెప్పారు. కమిన్స్, బుమ్రా బౌలింగ్ సిరీస్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా ఆస్ట్రేలియాలో ఆడిన చివరి రెండు సిరీస్‌లను భారత్ గెలుచుకోవడం గమనార్హం.

Similar News

News February 24, 2026

గద్వాల: బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి: కలెక్టర్

image

జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్-12 కింద ఈ ఏడాది జనవరిలో 77 మందిని రక్షించామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,323 మంది పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించామని కలెక్టర్ వివరించారు.

News February 24, 2026

నెదర్లాండ్స్ సిక్ లీవ్ నిబంధన.. మన దగ్గరా ఉండాలంటూ!

image

భారత్‌లో జ్వరమొచ్చినా లీవ్ దొరకక ఉద్యోగులు నానా అవస్థలు పడుతుంటే.. నెదర్లాండ్స్ ప్రభుత్వం మాత్రం బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే ఏకంగా రెండేళ్ల వరకు సిక్ లీవ్ తీసుకోవచ్చు. ఈ సమయంలో కంపెనీలు సదరు ఉద్యోగికి 70% జీతాన్ని తప్పనిసరిగా చెల్లించాలి. ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు పెద్దపీట వేస్తూ అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నిబంధన మన దగ్గర కూడా ఉండాలనే చర్చ జరుగుతోంది.

News February 24, 2026

క్యాన్సర్‌తో నటుడు, మిస్టర్ ఇండియా మయాంక్ పవార్ మృతి

image

ప్రముఖ టీవీ రియాలిటీ షో ‘MTV Splitsvilla’ సీజన్ 7 కంటెస్టెంట్, ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ మయాంక్ పవార్ (37) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఫిట్‌నెస్ మోడల్‌గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మయాంక్ మరణవార్త విని ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం అంటూ నివాళులర్పిస్తున్నారు.