News July 27, 2024

భద్రాచలం: 52 అడుగులకు గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 52.1 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 12.50 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది.

Similar News

News January 29, 2026

ఏకాదశి రోజున ఏం చేయాలంటే..?

image

5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో పాటు మన మనసును అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువును పూజించాలి. లక్ష్మీదేవిని కొలుస్తే సిరి సంపదలు సొంతమవుతాయని నమ్మకం. కుదిరితే జాగారణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. శక్తి కొలది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా తులసి దళాలతో స్వామిని పూజించడం, నెయ్యి దీపం వెలిగించడం అత్యంత శుభకరం.

News January 29, 2026

మున్సిపల్ ఎలక్షన్స్.. తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే?

image

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నిన్న మొదలైన సంగతి తెలిసిందే. తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 902 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 382, BRS 258, BJP 169, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 55 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. ఉ.10.30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటున్నారు.

News January 29, 2026

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’: CM CBN

image

AP: ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన ‘<<18580194>>సంజీవని<<>>’ ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయంపై ఆరా తీశారు.