News March 23, 2025

క్షమాపణల కంటే మరణాన్నే కోరుకున్న భగత్!

image

ఇంకెప్పుడూ హింసకు పాల్పడనని రాసిచ్చి క్షమాపణలు చెబితే వదిలేస్తామని బ్రిటిషర్లు భగత్‌సింగ్‌కు ఆఫర్ ఇచ్చారు. ‘వారికి క్షమాపణలు చెప్పడం కంటే చావే నాకు ఇష్టం’ అంటూ ఉరికంబాన్నే కోరుకున్నారాయన. ‘యంగ్ ఇండియా’ పుస్తకంలో గాంధీ భగత్ గురించి ప్రస్తావించారు. ‘భగత్ అసలు బతకాలని భావించలేదు. కనీసం అప్పీల్ కూడా చేయలేదు. <<15857764>>ఆ ముగ్గురూ<<>> మరణభయాన్ని జయించారు. ఆ ధీరత్వానికి మనం 1000సార్లు ప్రణమిల్లాలి’ అని రాసుకొచ్చారు.

Similar News

News March 25, 2025

IPL: నేడు గుజరాత్‌తో పంజాబ్ ఢీ

image

IPLలో ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచుల్లో తలపడ్డాయి. GT 3, PBKS 2 మ్యాచుల్లో గెలిచాయి. గత సీజన్‌లో KKRకు కప్ సాధించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో PBKSకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. GTకి గిల్ కెప్టెన్‌గా ఉన్నారు. మరి ఈ మ్యాచులో గెలుపెవరిది? కామెంట్ చేయండి.

News March 25, 2025

తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతంటే?

image

తెలంగాణకు ₹4,42,298 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. ఈ విషయంలో దేశంలో TG 24వ స్థానంలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 10,189 IT కంపెనీలు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా తెలిపారు. ఇదే సమయంలో 3,369 సంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల ద్వారా గత ఐదేళ్లలో ₹14,865కోట్ల టర్నోవర్ జరిగిందని వివరించారు.

News March 25, 2025

ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలేను భారతరత్నతో సత్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా CM ఫడణవీస్ మాట్లాడుతూ ‘మహాత్మా బిరుదు దేశంలో అన్నింటికన్నా గొప్పది. దీనిని ప్రజలు ఫూలే, గాంధీకి మాత్రమే ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఫూలే దంపతులు 19వ శతాబ్దంలో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.

error: Content is protected !!