News October 24, 2025
భారత్ బంద్.. యథావిధిగా స్కూళ్లు

భారీ వర్షాలకు ఇవాళ ప.గో., ప్రకాశం జిల్లాల్లో, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకూ భారీ వర్షాలున్న నేపథ్యంలో తమకూ సెలవివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు ఇవాళ భారత్ బంద్ కూడా కావడంతో స్కూళ్లకు సెలవు ఉంటుందని కొందరు భావించారు. కానీ, బంద్ ప్రభావం లేకపోవడంతో ఏపీ, టీజీలో పాఠశాలలు యథావిధిగా నడుస్తున్నాయి. మీ ప్రాంతంలో సెలవుందా? COMMENT.
Similar News
News February 7, 2026
పాక్కు వ్యాక్సిన్ కష్టాలు: భారత్తో పెట్టుకుంటే తప్పదు మరి!

భారత్తో సంబంధాలు చెడగొట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్కు ఒక్కొక్కటిగా తెలిసొస్తోంది. 2025 మే నాటి సైనిక ఘర్షణల తర్వాత ఇండియా నుంచి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో ఆర్థికంగా భారం పడుతోందని స్వయంగా ఆ దేశ మంత్రి ముస్తఫా వెల్లడించారు. GAVI ద్వారా ఇండియా నుంచి తక్కువ ధరకే టీకాలు పొందిన పాక్ ఇప్పుడు ఏటా $400 మిలియన్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. సొంతంగా వ్యాక్సిన్లు తయారు చేసుకోవడం వారికి తప్పేటట్లులేదు.
News February 7, 2026
KCRపై చర్యలు తీసుకునే దమ్ము లేదా: కిషన్ రెడ్డి

TG: KCR అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ము లేకపోతే CM పదవికి రేవంత్ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘KCRపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ చెప్పాలి. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత CMది కాదా? అధికారంలోకి వచ్చాక KCRకు చిప్పకూడు తినిపిస్తా, దోచుకున్న డబ్బంతా కక్కిస్తా అని అన్నారు. ఇప్పుడు ఆయనపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు’ అని ప్రెస్మీట్లో విమర్శించారు.
News February 7, 2026
8 ఏళ్లు మేమే ఉంటాం.. ఎవరొస్తారో రండి: సీఎం

TG: BRS నేతలకు కడుపు నిండా విషమేనని సీఎం రేవంత్ అన్నారు. ‘BRSకు ఓటు వేస్తే పాముకు పాలు పోసినట్లే. వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దు. కేసీఆర్ తన కుటుంబానికే ఉద్యోగాలిచ్చారు. మేం 70వేల ఉద్యోగాలు ఇచ్చి వెలుగులు నింపాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నాం. ఇప్పటి నుంచి 8 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఎన్నికల్లో ఎవరెవరు అడ్డొస్తారో చూద్దాం’ అని పరిగి సభలో సవాల్ విసిరారు.


