News May 2, 2024
కోవాగ్జిన్పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న ప్రకటనతో మిగతా వ్యాక్సిన్లు తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. దీంతో కోవాగ్జిన్పై భారత్ బయోటెక్ ప్రకటన చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించినట్లు తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే కోవాగ్జిన్ను విడుదల చేశామంది. తమ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వెల్లడించింది.
Similar News
News November 8, 2025
బరువు తగ్గేందుకు విపరీతంగా మందులు వాడేస్తున్నారు.. జాగ్రత్త!

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు చాలామంది భారతీయులు ఓ డయాబెటిస్ ఔషధాన్ని వాడుతున్నట్లు తేలింది. దీంతో మన దేశంలో వీటి అమ్మకాలు గత నెలలో ₹100 కోట్ల వరకూ జరిగాయి. అయితే ఈ మందులు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడానికి జీవనశైలిలో సరైన మార్పులు (పోషకాహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ) ప్రధానమని సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు వాడాలంటున్నారు.
News November 8, 2025
పుజారా కెరీర్ను కాపాడిన షారుఖ్.. ఎలాగంటే?

హీరో షారుఖ్ ఖాన్పై IND మాజీ ప్లేయర్ పుజారా భార్య పూజ ప్రశంసలు కురిపించారు. ఆమె రాసిన పుస్తకంలో షారుఖ్ తమ కుటుంబానికి చేసిన సాయాన్ని వివరించారు. ‘2008లో పుజారా మోకాలికి గాయమైంది. అప్పుడు SAలో చికిత్స చేయించేందుకు KKR యాజమాన్యం ముందుకొచ్చింది. అతనికి సాయంగా వెళ్లేందుకు పుజారా తండ్రికి పాస్పోర్ట్, ప్రయాణానికి షారుఖ్ సాయం చేశారు. KKR తరఫున పుజారా ఆడకపోయినా సాయం చేయడం గొప్ప విషయం’ అని గుర్తు చేశారు.
News November 8, 2025
APPLY NOW: MPMMCCలో ఉద్యోగాలు

వారణాసిలోని మహాత్మ పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్ <


