News November 5, 2024

భారత్ బ్రాండ్: రూ.30కే గోధుమ పిండి, రూ.34కే బియ్యం

image

కేంద్రం భారత్ బ్రాండ్ రెండో దశను ఆవిష్కరించింది. కాస్త ధరలు పెంచి రూ.30కే కేజీ గోధుమ పిండి, రూ.34కే KG బియ్యం వినియోగదారులకు ఇవ్వనుంది. 5-10 KGల బ్యాగులను NCCF, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మనుంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు దీనిని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఫేజ్-1లో రూ.27.50కే కేజీ గోధుమ పిండి, రూ.29కే కిలో బియ్యం అందించింది.

Similar News

News January 5, 2026

ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ESIC <<>>నవీ ముంబైలో 7 సర్జన్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీబీఎస్, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 69ఏళ్లు. జనవరి 6న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సర్జన్‌కు నెలకు రూ.1,0,0,600, మెడికల్ ఆఫీసర్‌కు రూ.85వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 5, 2026

సెంచరీలు బాదడంలో ఇతని ‘రూటే’ సపరేటు!

image

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నారు. 2021 నుంచి అతను ఏకంగా 24 శతకాలు కొట్టడమే దీనికి నిదర్శనం. రూట్ తర్వాత ప్లేస్‌లో నలుగురు ప్లేయర్లు ఉండగా, వారిలో ఒక్కొక్కరు చేసిన సెంచరీలు 10 మాత్రమే. ఈ ఫార్మాట్ ఆడుతున్న యాక్టివ్ ప్లేయర్లలో సచిన్ టెస్ట్ సెంచరీల(51) రికార్డును బద్దలు కొట్టే సత్తా ప్రస్తుతం రూట్‌కే ఉంది. తాజాగా యాషెస్‌లో ఆయన 41వ సెంచరీ సాధించారు.

News January 5, 2026

అమెరికా దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్ క్లోజ్!

image

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో అమెరికా సైన్యం జరిపిన ఆపరేషన్ పెను విధ్వంసానికి దారితీసింది. ఈ దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్‌లో మెజారిటీ సభ్యులు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పాడ్రినో సంచలన ప్రకటన చేశారు. US బలగాలు ‘కోల్డ్ బ్లడెడ్’గా తమ సైనికులు, అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నాయని ఆరోపించారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని వెనిజులా సైన్యం డిమాండ్ చేసింది.