News July 10, 2024

భోలే ఆశ్రమంలోకి లేడీస్‌కు మాత్రమే ఎంట్రీ?

image

‘హాథ్రస్‌’ భోలే బాబా గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని ఖేడ్లీ టౌన్‌ సమీపంలో సహజపూర్ గ్రామంలో అతడికో ఆశ్రమం ఉంది. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు ఉండే ఆ ఆశ్రమంలో స్థానికులకు, పురుషులకు ఎంట్రీ లేదని.. స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంటుందని వారు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు అనుమతి లేకుండా లోపలికి వెళ్తే సిబ్బంది దాడి చేస్తారని గ్రామస్థులు చెబుతుండటం గమనార్హం.

Similar News

News March 12, 2026

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

image

TG: KCR, హరీశ్ రావును ఇబ్బంది పెట్టడానికే కాళేశ్వరంపై ప్రభుత్వం ఘోష్ కమిషన్ వేసిందని వారి తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ KCR, హరీశ్, స్మితా సబర్వాల్, SK జోషి వేసిన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. కమిషన్ నివేదిక ఆధారంగా ముఖ్య నేతలిద్దరినీ టార్గెట్ చేసి, దుష్ప్రచారం చేశారని లాయర్ వాదించారు. కాగా కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

News March 12, 2026

హార్ముజ్ జలసంధి మూసే ఉండాలి: మొజ్తబా ఖమేనీ

image

హార్ముజ్ జలసంధి మూసే ఉండాలని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. ‘హార్ముజ్ మూసివేత కొనసాగుతుంది. శత్రువులపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్యలు తప్పవు’ అని చెప్పారు. గల్ఫ్‌లోని US స్థావరాలను మూసేయాలని, లేదంటే అటాక్స్ చేస్తామని స్పష్టంచేశారు. శత్రువుల నుంచి నష్టపరిహారం తీసుకుంటామని, లేదంటే వాళ్ల ఆస్తులు ధ్వంసం చేస్తామన్నారు. దేశంపై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తన తొలి ప్రసంగంలో హెచ్చరించారు.

News March 12, 2026

వైజాగ్ పోర్టు అరుదైన రికార్డు!

image

AP: వైజాగ్ పోర్టు సరకు రవాణాలో అరుదైన రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌‌లో 345 రోజుల్లో 85 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసింది. ఈ స్థాయిలో రవాణా చేయడం 92 ఏళ్ల పోర్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ FYలోనే 90 మిలియన్ టన్నుల టార్గెట్‌ను అందుకుంటామని పోర్టు ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. 2026-27లో 100M టన్నులను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.