News July 10, 2024

భోలే ఆశ్రమంలోకి లేడీస్‌కు మాత్రమే ఎంట్రీ?

image

‘హాథ్రస్‌’ భోలే బాబా గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని ఖేడ్లీ టౌన్‌ సమీపంలో సహజపూర్ గ్రామంలో అతడికో ఆశ్రమం ఉంది. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు ఉండే ఆ ఆశ్రమంలో స్థానికులకు, పురుషులకు ఎంట్రీ లేదని.. స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంటుందని వారు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు అనుమతి లేకుండా లోపలికి వెళ్తే సిబ్బంది దాడి చేస్తారని గ్రామస్థులు చెబుతుండటం గమనార్హం.

Similar News

News February 23, 2026

BREAKING: మాజీ మంత్రి కన్నుమూత

image

రైల్వే మాజీ మంత్రి, TMC నేత ముకుల్ రాయ్(71) గుండెపోటుతో కన్నుమూశారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఆయన చనిపోయినట్లు కుమారుడు సుభ్రాంశు వెల్లడించారు. ముకుల్ ఒకప్పుడు TMC చీఫ్, సీఎం మమతకు సన్నిహితంగా ఉండేవారు. పార్టీలో రెండో స్థానంలో పరిగణించేవారు. అయితే 2017లో ఆయన బీజేపీలో చేరారు. 18 ఎంపీ సీట్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో కృష్ణానగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మళ్లీ TMCలో చేరారు.

News February 23, 2026

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.

News February 23, 2026

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>నైవేలి<<>> లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా/డిగ్రీ( మైనింగ్) అర్హతగల వారు మార్చి 18 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. Jr.ఓవర్‌మెన్‌కు నెలకు రూ.31k-రూ.1L, మైనింగ్ సిర్ధార్‌కు రూ.26K-రూ.1.10L చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.nlcindia.in