News July 6, 2024

భోలే బాబా త్వరలో ప్రజల ముందుకొస్తారు: లాయర్

image

UPలోని హాథ్రస్ తొక్కిసలాట ఘటన అనంతరం పరారీలో ఉన్న భోలే బాబా త్వరలో ప్రజల ముందుకు రానున్నట్లు ఆయన లాయర్ తెలిపారు. కేసు విచారణకు ఆయన సహకరిస్తారని పేర్కొన్నారు. ఇటీవల బాబా నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, పెళ్లి ఖర్చులను బాబా ట్రస్ట్ భరిస్తుందని వెల్లడించారు.

Similar News

News April 3, 2026

అమరావతిపై 2-3 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్

image

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. పార్లమెంటు సెక్రటేరియట్ నుంచి హోం శాఖకు ఈ బిల్లు ప్రతులు చేరాయి. బిల్లును హోంశాఖ 2, 3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనుంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే చట్టంగా మారుతుంది. ఆపై కేంద్రం దానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధ రాజధాని కానుంది.

News April 3, 2026

శరీరంలో వేడిని ఎలా తగ్గించాలంటే?

image

కొందరి శరీరంలో ఎప్పుడూ వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది తగ్గాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కొబ్బరినీళ్లు, కలబంద, పుదీనా జ్యూస్ వంటివి వేడి తగ్గడంలో సహకరిస్తాయి. మజ్జిగ, విటమిన్ సీ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే కీరదోస, బీట్‌రూట్ జ్యూస్ తాగినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 3, 2026

₹931 కోట్ల అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్!

image

అమెరికాకు చెందిన మరో F-35 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దాడి చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి పలు ఫొటోలను షేర్ చేసింది. దీనిపై ఇంకా US స్పందించలేదు. మార్చి 19న కూడా F-35 జెట్‌ను కూల్చేసినట్టు ఇరాన్ చెప్పింది. ఈ విమానం విలువ ₹931 కోట్ల పైనే అని సమాచారం. కువైట్‌లో చమురు శుద్ధి కర్మాగారం, సౌదీలోని US రాడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసింది.