News March 22, 2025
BHPL: అటవీ భూముల కేటాయింపుపై సమీక్ష

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్అండ్బీ, మెగా ప్రాజెక్టు అధికారులకు అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 11, 2025
మంగనూరు గ్రామానికి నేడు వైస్ ఛాన్స్లర్ రాక

బిజినేపల్లి మండలంలోని మంగనూరులో విద్య విధానంపై సమ్మేళనం జరగనున్నది. ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.నిత్యానందరావు హాజరవుతున్నట్లు విజ్ఞాన వేదిక నిర్వాహకులు బోట్క కొండయ్య తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో సమ్మేళనం జరుగనుంది. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెసర్లు సమావేశానికి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
News July 11, 2025
మేదరమెట్లలో యాక్సిడెంట్

మేదరమెట్ల జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ఖాళీ అట్ట పెట్టెల లోడుతో వెళ్తున్న ఓ ఐచర్ లారీ బ్రిడ్జిపై బోల్తా పడింది. మార్టూరులోని ద్రోణాదులకు చెందిన లారీ డ్రైవర్ SK చాంద్ బాషా నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మేదరమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
News July 11, 2025
KNR ఆర్టీసీ జోనల్ హాస్పిటల్ లో అందుబాటులోకి ఎక్స్ రే సేవలు

ఆర్టీసీ KNR జోనల్ ఆస్పత్రిలో ఎక్స్ రే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా. ఎ.వి గిరిసింహారావు మాట్లాడుతూ.. నిత్యం రోడ్డు మీద ప్రయాణించే డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్, వర్క్ షాపు సిబ్బంది గాయాల బారిన పడుతుంటారని అన్నారు. వాటిని నిర్ధారించడానికి ఎక్స్ రే ఉపయోగపడుతుందని అన్నారు. ఉన్నత శ్రేణి డిజిటల్ ఎక్స్ రే మెషీన్ ని అందించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.