News March 12, 2025
BHPL: అన్నను హతమార్చిన తమ్ముడికి జీవిత ఖైదు

అన్నను చంపిన కేసులో తమ్ముడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన ఘటన <<1978567>>BHPL జిల్లాలో<<>> జరిగింది. పోలీసుల వివరాలు.. కాటారం మం. గంగారానికి చెందిన నాగరాజు, అశోక్ అన్నదమ్ములు. ఆస్తి పంపకాల అనంతరం.. తమ్ముడు స్థలాన్ని అమ్ముకుని డబ్బు ఖర్చు చేశాడు. తీరా అన్న ఆస్తిలో వాటా వస్తుందని ఇబ్బంది పెట్టడంతో ఊరి విడిచి వెళ్లారు. MPTC ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన అన్నతో గొడవకు దిగి బీరు సీసాతో తమ్ముడు హతమార్చాడు.
Similar News
News December 12, 2025
విశాఖ నుంచి తిరుగుపయనమైన సీఎం

ఒకరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు విశాఖకు శుక్రవారం వచ్చారు. విశాఖలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమై, పలు కంపెనీలకు మంత్రులు, అధికారులతో శంకుస్థాపన చేపట్టారు. అనంతరం వైజాగ్ ఎకానమిక్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం తిరుగు పయనమయ్యారు. ఆయనకు ఎయిర్ పోర్ట్లో కూటమి నాయకులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
News December 12, 2025
మహిళా జర్నలిస్టుతో శశిథరూర్.. వైరలవుతున్న ఫొటోలు

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ మహిళా జర్నలిస్టుతో ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. థరూర్ భుజంపై ఆమె చేతులు వేసి ఉన్న పోజ్పై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. కాగా ఆమె పేరు రంజున్ శర్మ. రష్యా రాజధాని మాస్కోలో RT ఇండియా న్యూస్ హెడ్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ థరూర్ లేదా రంజున్ ఈ విషయంపై స్పందించలేదు.
News December 12, 2025
అనకాపల్లి: సమస్యల పరిష్కరించాలని అంగన్వాడీల ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలన్నారు. 2023లో 42 రోజులు పాటు సమ్మె చేసిన అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.


