News March 12, 2025
BHPL: అన్నను హతమార్చిన తమ్ముడికి జీవిత ఖైదు

అన్నను చంపిన కేసులో తమ్ముడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన ఘటన <<1978567>>BHPL జిల్లాలో<<>> జరిగింది. పోలీసుల వివరాలు.. కాటారం మం. గంగారానికి చెందిన నాగరాజు, అశోక్ అన్నదమ్ములు. ఆస్తి పంపకాల అనంతరం.. తమ్ముడు స్థలాన్ని అమ్ముకుని డబ్బు ఖర్చు చేశాడు. తీరా అన్న ఆస్తిలో వాటా వస్తుందని ఇబ్బంది పెట్టడంతో ఊరి విడిచి వెళ్లారు. MPTC ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన అన్నతో గొడవకు దిగి బీరు సీసాతో తమ్ముడు హతమార్చాడు.
Similar News
News November 28, 2025
శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.
News November 28, 2025
NLG: దేశంలోనే అతిపెద్ద భూస్కామ్ ఇదే: మాజీ మంత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీదైన భూములను ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినోళ్లకు కట్టబెడుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట MLA జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ మన తెలంగాణలో జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పాలసీల పేరుతో భారీగా స్కామ్లు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
News November 28, 2025
HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.


