News March 12, 2025
BHPL: అన్నను హతమార్చిన తమ్ముడికి జీవిత ఖైదు

అన్నను చంపిన కేసులో తమ్ముడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన ఘటన <<1978567>>BHPL జిల్లాలో<<>> జరిగింది. పోలీసుల వివరాలు.. కాటారం మం. గంగారానికి చెందిన నాగరాజు, అశోక్ అన్నదమ్ములు. ఆస్తి పంపకాల అనంతరం.. తమ్ముడు స్థలాన్ని అమ్ముకుని డబ్బు ఖర్చు చేశాడు. తీరా అన్న ఆస్తిలో వాటా వస్తుందని ఇబ్బంది పెట్టడంతో ఊరి విడిచి వెళ్లారు. MPTC ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన అన్నతో గొడవకు దిగి బీరు సీసాతో తమ్ముడు హతమార్చాడు.
Similar News
News December 21, 2025
ఇన్స్టాలో లవ్.. బాలికను లాడ్జ్కు తీసుకెళ్లి..

AP: సోషల్ మీడియా స్నేహాలు విషాదాంతమవుతున్నాయి. తాజాగా ఇన్స్టాలో పరిచయమైన ఇంటర్ అమ్మాయిని రాహుల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వంచించాడు. విజయవాడలోని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మంగళగిరిలోనూ మైనర్పై నలుగురు గ్యాంగ్ రేప్నకు పాల్పడ్డారు. బాధితురాళ్ల పేరెంట్స్ ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల స్మార్ట్ఫోన్ వాడకం, SM ఖాతాలపై పేరెంట్స్ నిఘా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 21, 2025
ఎల్లారెడ్డిపేటలో దొంగనోట్ల కలకలం

ఎల్లారెడ్డిపేట మండలంలో దొంగనోట్ల చలామణి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను అదునుగా చేసుకుని పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని తరలించినట్లు తెలుస్తోంది. ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు, ఓటర్లకు వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన నోటును గమనించిన వ్యాపారి అది నకిలీదని గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనా సమాచారం.
News December 21, 2025
KMR: తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు పుల్గం రవీందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర కృషి చేస్తున్నందుకు ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై అందర్నీ కలుపుకొని ముందుకు వెళతానని అన్నారు.


