News February 4, 2025
BHPL: అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి

ఆర్థిక పునరావాస పథకం కింద అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. కావున, అర్హులైన దివ్యాంగులు ఆన్లైన్ వెట్ సైట్ www.tsobmms.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అర్హత, ఇతర వివరాలకై జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News November 22, 2025
రాములపల్లి గ్రామ శివారులో మహిళ మృతదేహం కలకలం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలు గ్రామానికి చెందిన చింతకుంట్ల సుకృతగా గుర్తించారు. ఇది హత్యనా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2025
రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్: CM

TG: ఫ్యూచర్ సిటీలో DEC 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా ఈ వేడుక ఉండాలని సూచించారు. 8న ప్రభుత్వ పథకాలు, విజయాలను చాటి చెప్పాలన్నారు. 9న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉండాలని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులకు ఇచ్చే ప్రాధాన్యంపై ఆడియో, వీడియో ప్రజెంటేషన్లు రెడీ చేయాలన్నారు.
News November 22, 2025
వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ధారసింగ్ జాదవ్

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ధారసింగ్ జాదవ్ ఎన్నికయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో పెద్దేముల్ జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన ధారసింగ్ జాదవ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గంలో కీలకస్థాయి పదవుల్లో సేవలందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. తాజాగా ఆయన్ను DCC వరించింది.


