News February 11, 2025

BHPL: ‘ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఈ నెల 27న జరుగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై అధికారులు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

Similar News

News December 4, 2025

GVMC స్థాయి సంఘంలో ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు..

image

GVMC స్థాయి సంఘం సమావేశం శనివారం జరగనుంది. మొత్తం 257 అంశాలతో అజెండా కాపీలను సిద్ధం చేసి సభ్యులకు అందజేశారు. ఇన్ని అంశాలను ఒకే సారి పెట్టడం ద్వారా ఎలాంటి చర్చ లేకుండా అమోదించే అవకాశం ఉంది. దీంతో ఆయా అంశాలను స్థాయి సంఘం సభ్యులు పూర్తిగా చదివే అవకాశం కూడా లేకుండా పోతుంది. ప్రజాధనాన్ని అవసరం ఉన్నా.. లేకపోయినా ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

News December 4, 2025

టైర్లు ధ్వంసమైనా, నీటిలోనూ ప్రయాణం ఆగదు

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్‌ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.

News December 4, 2025

జమ్మికుంట: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

image

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జమ్మికుంట మండలంలో చోటుచేసుకుంది. తనుగుల గ్రామానికి చెందిన జక్కే రజినీకాంత్(29) ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి చిన్నతనంలో మరణించగా ట్రాక్టర్ నడుపుతూ కుటుంబపోషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ కోసం చేసిన అప్పులు తీరక మనస్తాపానికి గురైన రజినీకాంత్ బుధవారం ఉదయం బిజ్జిగిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.