News February 11, 2025
BHPL: ‘ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలి’

ఈ నెల 27న జరుగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై అధికారులు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
Similar News
News February 7, 2026
ఎన్నికల నిబంధనలు పక్కాగా పాటించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శుక్రవారం ఆలేరులోని బాలికల ఉన్నత పాఠశాలలో PO, APOలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
News February 7, 2026
కరీంపేట: పొలంలోనే గుండెపోటుతో రైతు మృతి

శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన రైతు బొజ్జ సమ్మయ్య(53) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. మృతుడు తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో రైతు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన పొలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే సమ్మయ్య ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
News February 7, 2026
ఉన్న వాటినే కాపాడుకోలేరు.. పాక్పై J&K సీఎం సెటైర్లు

కశ్మీర్ తమ దేశంలో <<19062687>>అంతర్భాగమవుతుందని<<>> పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘మేం వారిలో భాగమవుతామా? వాళ్ల దగ్గర ఉన్న వాటినే సరిగ్గా చూసుకోలేరు. ఇక మాతో ఏం చేస్తారు?’ అంటూ సెటైర్లు వేశారు.


