News February 12, 2025
BHPL: కొత్త రేషన్కార్డుల కోసం మీ సేవాలో అప్లయ్ చేసుకోవాలి: అదనపు కలెక్టర్

నూతన రేషన్ కార్డుల నమోదు ప్రక్రియకు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్ చేయటానికి అవకాశం కల్పించినట్లు భూపాలపల్లి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ చేయుటలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు, ఈడీఎం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News December 11, 2025
సిద్దిపేట జిల్లాలో 9 గంటల వరకు ఇలా..!

సిద్దిపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 24.38 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. దౌల్తాబాద్ 22 శాతం, గజ్వేల్లో 21 శాతం, జగదేవపూర్ 21.27 శాతం, మర్కూక్ 29.30 శాతం, ములుగు 26.87 శాతం, రాయపోలు 26. 37 శాతం, వర్గల్ 26.37 శాతం పోలింగ్ నమోదైంది.
News December 11, 2025
విజయనగరంలో బ్రదర్ అనిల్

విజయనగరం పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురజాడ కళా భారతి ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి విశేషంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కార్యక్రమానికి వచ్చి దైవ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ అనేది కేవలం వేడుక మాత్రమే కాదని, మనుషుల మధ్య ప్రేమ, సేవ, క్షమ, దయ వంటి విలువలను పంచే పవిత్రమైన సందర్భమని ఆయన పేర్కొన్నారు.
News December 11, 2025
ములుగు: 2 గంటల్లో.. 13.31 శాతం ఓటింగ్

ములుగు జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 13.31% ఓట్లింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు గోవిందరావుపేట మండలంలో 10.65%, ఏటూరునాగారం – 10.86, తాడ్వాయిలో 20.03% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికల పరిశీలకులు, అధికారులు మండలాల వారీగా పర్యటిస్తూ పోలింగ్ సరలిని పర్యవేక్షిస్తున్నారు.


