News January 27, 2025
BHPL: కొత్త వెంటిలేటర్లను ప్రారంభించిన MLA, కలెక్టర్

భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్య సేవలను మెరుగు పరిచే దిశగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ ఆర్) నిధులతో అందించిన కొత్త వెంటిలేటర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈ వెంటిలేటర్ల ప్రారంభం ద్వారా అత్యవసర వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
Similar News
News November 27, 2025
పాలమూరు: మాజీ సర్పంచ్ హత్య.. చేసింది వీళ్లే.!

కేటీదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8.5 లక్షల నగదు, నాలుగు కార్లు, రెండు బైకులు, ఒక బొలెరో వాహనం, 11 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధరూర్ మండలం జాంపల్లి వద్ద చిన్న భీమరాయుడును బొలెరో వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
FLASH.. HNKలో సిగ్మా జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన

హనుమకొండలో ఆందోళన నెలకొంది. బట్టుపల్లి వద్ద ఉన్న సిగ్మా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి అదృశ్యం అయ్యాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి కనిపించకపోవడంతో విద్యార్థి తండ్రి కాలేజీ బిల్డింగ్ ఎక్కి సూసైడ్ చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
News November 27, 2025
BREAKING: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

సున్నంచెరువు కూల్చివేతల వ్యవహారంపై హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. FTL నిర్ధారణ లేకుండా హద్దులు నిర్ణయించడం, గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను పట్టించుకోకపోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. సియేట్ మారుతీహిల్స్ కాలనీలో ఇకపై ఫెన్సింగ్, కూల్చివేత చర్యలకు దిగొద్దని హైకోర్టు హెచ్చరించింది.


