News January 28, 2025

BHPL: కొత్త వెంటిలేటర్లను ప్రారంభించిన MLA, కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్య సేవలను మెరుగు పరిచే దిశగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ ఆర్) నిధులతో అందించిన కొత్త వెంటిలేటర్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈ వెంటిలేటర్ల ప్రారంభం ద్వారా అత్యవసర వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Similar News

News December 16, 2025

సర్పంచ్ అభ్యర్థి మృతి.. డబ్బును తిరిగిచ్చేసిన ఓటర్లు!

image

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందడంతో అతని వద్ద ఓటు కోసం తీసుకున్న డబ్బులను గ్రామస్థులు తిరిగిచ్చారు. ఈ ఘటన నల్గొండ(D) మునుగోడు(M) కిష్టాపురంలో జరిగింది. చెనగోని కాటంరాజు BRS మద్దతుతో పోటీ చేయగా 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమితో మనస్తాపానికి గురైన ఆయన గుండెపోటుకు గురై చనిపోయారు. ఓట్ల కోసం ఆయన పంచిన డబ్బును పలువురు గ్రామస్థులు జమ చేసి తిరిగి ఇచ్చేశారు.

News December 16, 2025

1,160 మందితో బందోబస్తు: సంగారెడ్డి ఎస్పీ

image

జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే 8 మండల గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 1,160 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు ఉంటుందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

News December 16, 2025

అనంతగిరి ఎంపీపీ పదవి నుంచి శెట్టి నీలవేణి తొలగింపు

image

అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిని ఎంపీపీ పదవి నుంచి తొలగిస్తూ సంబంధిత ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీపీ నీలవేణిపై ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని సబ్ కలెక్టర్‌ను కోరారు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో ప్రిసైడింగ్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు అక్టోబరు 30న అనంతగిరిలో సమావేశం నిర్వహించారు. 11 మంది ఎంపీటీసీ సభ్యులు నీలవేణికి వ్యతిరేకంగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది.