News March 31, 2025

BHPL: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం (UPDATE)

image

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో ఇది 3వ ప్రభుత్వ ఉద్యోగంగా సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.

Similar News

News October 22, 2025

విజయనగరం జోన్‌లో 1400 మందికి ప్రమోషన్లు

image

APSRTCలో ప్రమోషన్ల ప్రక్రియ జాబితా విడుదల అయింది. విశాఖ జిల్లాలో 572 మందికి ప్రమోషన్లు జారీ కాగా మొత్తం విజయనగరం జోన్లో 1,400 మందికి ప్రమోషన్లు ఇస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, తదితర విభాగాల నుంచి సిబ్బందికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిందని వెల్లడించారు.

News October 22, 2025

భారీ వర్షాలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష..!

image

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సీఎండీలు, వివిధ జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలపై సమీక్షించారు. బాపట్ల జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

News October 22, 2025

96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు: కలెక్టర్

image

ఈ నెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని 96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. 5 నుంచి 17 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జరుగుతుందన్నారు. ఆధార్ రికార్డులు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు, పథకాలు, విద్యా అవకాశాలను పొందగలుగుతారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.