News April 2, 2025
BHPL: ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం వలస కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన 20 మంది వలస కూలీలు వాహనంలో వెళ్తుండగా కమలాపూర్-రాంపూర్ గ్రామాల మధ్య వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది వలసకూలీలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కూలీలను భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2025
పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’: పొంగులేటి

TG: ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ రుణాన్ని ఉడతాభక్తిగా తీర్చుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం ఇస్తామన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రతి పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని ముద్రిస్తామని వెల్లడించారు.
News November 17, 2025
పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’: పొంగులేటి

TG: ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ రుణాన్ని ఉడతాభక్తిగా తీర్చుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం ఇస్తామన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రతి పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని ముద్రిస్తామని వెల్లడించారు.
News November 17, 2025
పెళ్లి రోజునే మరణశిక్ష విధించారు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు <<18311087>>ఉరిశిక్ష<<>> విధించిన సంగతి తెలిసిందే. ఈ తేదీతో ఆమెకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 1967లో సరిగ్గా ఇదే తేదీన శాస్త్రవేత్త వాజెద్ మియాను హసీనా పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి రోజునే ఉద్దేశపూర్వకంగా ఆమెకు మరణశిక్ష విధించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఇది రాజకీయ ప్రతీకారమేనని విమర్శిస్తున్నారు.


