News April 2, 2025
BHPL: ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం వలస కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన 20 మంది వలస కూలీలు వాహనంలో వెళ్తుండగా కమలాపూర్-రాంపూర్ గ్రామాల మధ్య వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది వలసకూలీలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కూలీలను భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
SRPT: గ్రంథాలయాలు వెలుతురునిచ్చే కేంద్రాలు: కలెక్టర్

గ్రంథాలయాలు జీవితానికి వెలుతురునిస్తూ, భవిష్యత్తుకు దారి చూపెట్టేవి అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువత వాటిని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు
News November 21, 2025
SRPT: గ్రంథాలయాలు వెలుతురునిచ్చే కేంద్రాలు: కలెక్టర్

గ్రంథాలయాలు జీవితానికి వెలుతురునిస్తూ, భవిష్యత్తుకు దారి చూపెట్టేవి అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువత వాటిని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు
News November 21, 2025
పటాన్ చెరులో గంజాయి చాక్లెట్ల కలకలం

పటాన్చెరు పరిధి ఐడీఐ బొల్లారం మున్సిపాలిటీలోని లక్ష్మీనగర్లో నివాసం ఉండే ఒడిశాకు చెందిన అజయ్ కుమార్(50) తన పాన్ షాప్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద 238 గంజాయి చాక్లెట్లు, రూ.1,270 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


