News April 2, 2025
BHPL: ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం వలస కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన 20 మంది వలస కూలీలు వాహనంలో వెళ్తుండగా కమలాపూర్-రాంపూర్ గ్రామాల మధ్య వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది వలసకూలీలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కూలీలను భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలో మార్పు

TG: ఇంటర్ సెకండియర్ పబ్లిక్ పరీక్షల <<18157878>>షెడ్యూల్లో<<>> స్వల్ప మార్పు జరిగింది. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను 4వ తేదీకి వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. 4న హోలీ పండుగ ఉంటుందని భావించి షెడ్యూల్లో 3వ తేదీన పరీక్ష ఉంటుందని ప్రకటించారు. కానీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సెలవుల జాబితాలో 3న హోలీ పండుగ సెలవు ఉంది. దీంతో ఈ మార్పు చేశారు. అటు ఫిబ్రవరి 2 నుంచి 3 విడతల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
News December 16, 2025
గతంలో ఎన్నడూ లేనంత పురోగతి: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేని పురోగతి సాధించినట్లు చెప్పారు. ఇరుదేశాల శాంతికి US చేస్తున్న ప్రయత్నాలకు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూకే తదితర యూరోపియన్ దేశాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నట్లు తెలిపారు. బెర్లిన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో యూరోపియన్ నేతలు చర్చల వేళ ట్రంప్ పైవ్యాఖ్యలు చేశారు.
News December 16, 2025
ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.


