News April 2, 2025
BHPL: ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం వలస కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన 20 మంది వలస కూలీలు వాహనంలో వెళ్తుండగా కమలాపూర్-రాంపూర్ గ్రామాల మధ్య వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది వలసకూలీలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కూలీలను భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
చెత్త రికార్డు.. టెస్టు చరిత్రలోనే తొలిసారి

యాషెస్ తొలి టెస్టులో చెత్త రికార్డు నమోదైంది. వరుసగా మూడు ఇన్నింగ్సుల్లో ఒక్క రన్ చేయకుండా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. టెస్టు చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులో జాక్ క్రాలే, AUS తొలి ఇన్నింగ్స్లో వెదరాల్డ్ డకౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్లో ENG: 172/10, AUS: 132/10 రన్స్ చేశాయి. రెండో ఇన్నింగ్స్లో 16 ఓవర్లకు ENG 104 పరుగుల ఆధిక్యం(64/1)లో కొనసాగుతోంది.
News November 22, 2025
లొంగుబాటు.. చొక్కారావు, రాజిరెడ్డిలు ఉంటారా..?

ఉమ్మడి కరీంనగర్కు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేతలు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ ఇవాళ రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. చొక్కారావు దండకారణ్య కమిటీ మెంబర్గా విధులు నిర్వర్తిస్తుండగా, రాజిరెడ్డి రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరితోపాటు మరో 37మంది మావోలు వనం నుంచి జనంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
News November 22, 2025
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన CISF సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా అనుమానిత వస్తువులను పరిశీలించారు. సందర్శకుల పాసుల కౌంటర్ మూసివేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, అది ఫేక్ మెయిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.


