News March 30, 2025
BHPL: తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే పండుగ: కలెక్టర్

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఉగాది తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని అన్నారు. కొత్త ఆశలతో నూతన ఉత్సాహంతో నిండిన విశేషమైన రోజని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలని అన్నారు.
Similar News
News October 28, 2025
పల్నాడు జిల్లా భవిష్యత్తుపై ఉత్కంఠ.!

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబుతో నేడు మంత్రివర్గ ఉప సంఘం భేటీ అవుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా ఏర్పడనున్న అమరావతి జిల్లాలో పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని చేర్చాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీంతో పల్నాడు నైసర్గిక స్వరూపం మారబోతుంది. జిల్లాలో మరేవైనా మార్పులు, చేర్పులు జరుగుతాయా అనే విషయంపై చర్చ కోనసాగుతోంది.
News October 28, 2025
పదరలో అత్యధిక వర్షపాతం నమోదు

నాగర్కర్నూల్ జిల్లాలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పదర మండల కేంద్రంలో 31.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిర్సనగండ్లలో 19.5 మి.మీ, ఐనోల్లో 16.5 మి.మీ., వెల్తూర్లో 11.8 మి.మీ. చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నాగర్కర్నూల్లో 1.8 మి.మీ. కాగా, అత్యల్పంగా పాలెంలో 0.5 మి.మీ. నమోదైంది.
News October 28, 2025
జూబ్లీ బైపోల్: ఇంటి వద్దే వారికి ఓటు హక్కు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దివ్యాంగులు, వృద్ధులకు ఎన్నికల కమిషన్ ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇందుకు ఓటర్లు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 102 మంది వృద్ధులు, దివ్యాంగులు దీనికోసం అప్లై చేసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఈసీ ఈ చర్యలు చేపట్టింది.


