News March 30, 2025
BHPL: తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే పండుగ: కలెక్టర్

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఉగాది తెలుగు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని అన్నారు. కొత్త ఆశలతో నూతన ఉత్సాహంతో నిండిన విశేషమైన రోజని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలని అన్నారు.
Similar News
News November 28, 2025
సదరం రీ-అసెస్మెంట్ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

విజయనగరం జిల్లాలో NTR భరోసా పింఛన్ రీ-అసెస్మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సదరం రీ-అసెస్మెంట్ కార్యక్రమంపై ఆయన శుక్రవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-అసెస్మెంట్లో జాప్యం జరుగుతుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 28, 2025
ఖమ్మం: సీపీఐ శతాబ్ది ఉత్సవాలు జనవరి 18కి వాయిదా

ఖమ్మం నగరంలోని ప్రసాద్ భవన్లో శుక్రవారం సీపీఐ నాయకుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మంలో జరగాల్సిన సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జనవరి 18కి వాయిదా వేసినట్లు వారు తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జనవరి 18న జరిగే జయంతి ఉత్సవాలకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
News November 28, 2025
2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: సీఎం

AP: రాజధాని అమరావతికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదన్నారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా 6541 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 2028 మార్చికి పూర్తయ్యేలా అమరావతి పనులు సాగుతున్నాయని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఎంతగానో సహకరిస్తున్నారని కొనియాడారు.


