News February 4, 2025

BHPL: నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: DMHO

image

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్.మధుసూదన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంవో, డాక్టర్లు, సూపర్‌వైజర్లతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతీయ నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 1 నుంచి 19 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరికి నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని సూచించారు.

Similar News

News October 14, 2025

మామిడి రైతులకు డబ్బులు విడుదల

image

AP: తోతాపురి మామిడి విక్రయించిన రైతులకు ప్రభుత్వం నగదు విడుదల చేసింది. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల సబ్సిడీని జమ చేసింది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకూ ఎక్స్‌గ్రేషియా నిధులు రిలీజ్ చేసింది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 19 జిల్లాల్లో 106 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5.30కోట్లు జమ చేసింది.
* రోజూ అగ్రికల్చర్ వార్తల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి..

News October 14, 2025

జాతీయ రహదారిపై యాక్సిడెంట్

image

ఒంగోలు-గుంటూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కర్రల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ ప్రసాద్ చెక్ పోస్ట్ సిబ్బందితో చెస్ రాయించుకొనేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయంకావడంతో హైవే మొబైల్ పోలీసులు అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా సేఫ్టీ కోన్స్ ఏర్పాటు చేశారు.

News October 14, 2025

ITI&ATCలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ ITI& ATC భద్రాచలం, కృష్ణ సాగర్లో 2025 వాక్ ఇన్ అడ్మిషన్ కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల కోరుతున్నట్లు కృష్ణ సాగర్ ప్రిన్సిపల్ ధర్మచారి తెలిపారు. సెప్టెంబర్ సెషన్ కొరకు NCVT ప్యాటర్న్ కింద వివిధ ఇంజనీరింగ్ & నాన్ ఇంజనీరింగ్ ITI&ATC ట్రేడ్స్‌లలో శిక్షణ పొందటానికి భద్రాచలం, కృష్ణ సాగర్లో మిగిలిన సీట్ల కోసం ఈనెల 17 వరకు అప్లై చేసుకోవాలని సూచించారు.