News January 31, 2025
BHPL: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,563 మంది విద్యార్థులను గాను రూ.8,96,610 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News October 19, 2025
వనపర్తి: రేపే దీపావళి.. ఈ జాగ్రత్తలు మరవకండి.!

✓ లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రాకర్స్ కొనండి.
✓ వాహనాల దగ్గర, కరెంట్ వైర్ల కింద, డ్రైనేజీ సమీపంలో బాణసంచా కాల్చడం ప్రమాదకరం.
✓ గాలి వీచే సమయంలో రాకెట్ల వంటి పైకి ఎగిరే టపాసులు కాల్చకండి.
✓ కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్లో వేయండి.
✓ ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలున్న వారు టపాసులకు దూరంగా ఉండండి. నాణ్యమైన మాస్క్లు ధరించండి.
> SHARE..
News October 19, 2025
వనపర్తి: కొత్త మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పెంపు

కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడగించినట్లు వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం బ్యాంకులు పనిచేయకపోవడంతో డీడీలు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురుగా వ్యాపారుల వినతులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. లక్కీ డ్రా ఈనెల 27న కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనునట్లు వెల్లడించారు.
News October 19, 2025
నేడు ఉర్సు గుట్టపై నరకాసుర వధ..!

దీపావళి సందర్భంగా WGL ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో నేడు నరకాసుర వధ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో 23 ఏళ్లుగా నరకాసురవధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి 8 గంటలకు మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి దహనం చేస్తారు.