News March 19, 2025

BHPL: పాఠశాలలకు హాల్టికెట్లు: డీఈవో

image

ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఐడీవోసీ కార్యాలయం నుంచి డీఈవో రాజేందర్ చీఫ్ సూపరింటెండ్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. హాల్‌టికెట్లను ఆయా పాఠశాలలకు పంపామని, ఎవరైనా హాల్ టికెట్స్ అందని విద్యార్థులు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఏమైనా సమస్యలు అంటే 040 23230942 నంబరుకు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు.

Similar News

News November 21, 2025

మార్గశిరం వచ్చేసింది.. ఈ వ్రతాలు చేస్తున్నారా?

image

విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో కొన్ని ముఖ్యమైన వ్రతాలను ఆచరిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కాత్యాయనీ వ్రతం చేస్తారు. గురువారాల్లో మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేస్తే రుణ సమస్యలు తొలగి, సంపద, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. మనోధైర్యం, ధృడ సంకల్పం, దుష్ట గ్రహాల ప్రభావం నుంచి రక్షణ కోసం హనుమద్వ్రతం చేస్తారు. ☞ ఏ వ్రతం ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 21, 2025

జిల్లాలో భారీగా పంటల కొనుగోలు: నిర్మల్ కలెక్టర్

image

పంటల కొనుగోలుపై కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 14,760.56 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు 5,746 క్వింటాళ్ల సోయా, 7,715 క్వింటాళ్ల మొక్కజొన్న, 66,140 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హామీ ఇచ్చారు.

News November 21, 2025

తెలంగాణలో నేడు..

image

⋆ సా.4 గంటలకు HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం రెండో ఎడిషన్‌ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
⋆ ఉ.10 గంటలకు JNTU జూబ్లీ సెలబ్రేషన్స్‌లో పాల్గొననున్న సీఎం రేవంత్
⋆ పత్తి రైతులకు మద్దతుగా అఖిలపక్షం ఆందోళన.. NH 44 దిగ్బంధానికి బీఆర్ఎస్ పిలుపు
⋆ ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం.. రిజర్వేషన్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ