News March 4, 2025
BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
Similar News
News October 18, 2025
వేదాల ప్రధాన లక్ష్యం ఇదే..

మానవాళిని 3 రకాల కష్టాల నుంచి విముక్తి కలిగించడమే వేదాల ప్రధాన లక్ష్యం. ఈ కష్టాలనే త్రిబాధలని అంటారు. అందులో మొదటిది మన శరీరానికీ, మనసుకీ వచ్చే సమస్యలు. రెండోది ఇతరులు, జంతువుల వల్ల కలిగే బాధలు. చివరిది ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే కష్టాలు. ఈ మూడు బాధలు తొలగి, ప్రతి ఒక్కరూ జీవితంలో నిజమైన శాంతిని, సుఖాన్ని పొందాలని వేదం కోరుకుంటుంది. ఇందుకోసం భగవంతుడిని ప్రార్థించమని ఉద్బోధిస్తుంది. <<-se>>#VedikiVibes<<>>
News October 18, 2025
తెలంగాణ బంద్.. ఇది ఎవరిపై పోరాటం?

TG: రాష్ట్ర బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు బంద్ చేపట్టాయి. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్ర అధికార పార్టీ BJP కూడా మద్దతు తెలిపాయి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే మరి బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికా? రాష్ట్ర ప్రభుత్వానికా? అసలు పోరాటం ఎవరిపై?
News October 18, 2025
దోమకొండ టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

దోమకొండకు చెందిన దేవరగట్టు బాలప్రసాద్ 17 ఏళ్ల కృషికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కింది. తన ఆలోచనలను, సాంకేతికతను, మానవత్వాన్ని జోడించి నాయకుడిగా ఉద్యోగులను చేర్చాడు. ఖచ్చితమైన విశ్వాసంతో జనరేటివ్ AI హ్యాకథాన్ మార్పుతో కోడర్గా, సృష్టికర్తగా స్వీకరించి, యాప్గా కాకుండా మిషన్గా భావించాడు. జీవితంలో ప్రేరణ అనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు.