News March 4, 2025

BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

image

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన <<15642532>>ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్‌కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

Similar News

News December 3, 2025

GNT: జడ్పీ నిధుల విడుదలకు మంత్రి అనగాని హామీ

image

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌కు రావాల్సిన బకాయిలపై జడ్పీ ఛైర్‌ పర్సన్ హెనీ క్రిస్టినా బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిశారు. రిజిస్ట్రేషన్ సర్ చార్జీల కింద 2022 నుంచి రావాల్సిన రూ.35.71 కోట్లను విడుదల చేయాలని కోరారు. గుంటూరుకు రూ.22.34 కోట్లు, పల్నాడుకు రూ.11.19 కోట్లు, బాపట్లకు రూ.2.18 కోట్లు బకాయి ఉన్నాయన్నారు. స్పందించిన మంత్రి.. ఆర్థిక మంత్రి పయ్యావులతో మాట్లాడి నిధులు చేయిస్తానన్నారు.

News December 3, 2025

భూపాలపల్లి: ప్రధాన అస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలి: కలెక్టర్

image

జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది సమయ పాలన పాటించట్లేదని తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సమయ పాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసులుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అన్నారు. వైద్య కళాశాలల్లో రూ.75 లక్షల వ్యయంతో చేపడుతున్న అదనపు తరగతి గదుల భవనం త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సూచించారు.

News December 3, 2025

స్థల సమస్య ఉన్న ప్రాంతాలపై నివేదిక ఇవ్వండి: కలెక్టర్

image

ఆసుపత్రి భవనాల నిర్మాణానికి స్థల సమస్య ఉన్న ప్రాంతాలపై కాటారం సబ్ కలెక్టర్, భూపాలపల్లి ఆర్డీవోకు నివేదికలు అందచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పంచాయతీ రాజ్, టీజీఈడబ్ల్యూఐడీసీ, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతి, నిధుల వినియోగంపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.