News March 4, 2025

BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

image

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్‌కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

Similar News

News January 25, 2026

సిరిసిల్ల: కన్న పేగు కంటతడి.. తల్లడిల్లిన గోమాత

image

కన్న పేగు మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. తల్లి ప్రేమకు అద్దం పట్టిన ఘటన వీర్నపల్లి మండలం ఎర్రగడ్డతండాలో జరిగింది. బానోత్ రాజు పశువులు సమీప అటవీకి మేతకు వెళ్లాయి. అక్కడే ఉన్న చిరుత లేగదూడపై దాడి చేసి హతమార్చింది. ఇంటికి చేరుకున్న ఆవు యజమానిని తచ్చాడి మృతిచెందిన బిడ్డ కళేబరం వద్దకు తీసుకెళ్ళింది. లేగదూడ కళేబరాన్ని ముద్దాడుతూ గోమాత తల్లడిల్లిన తీరు కలచివేసింది.

News January 25, 2026

పన్ను వసూళ్లలో ఎదురేలేదు..

image

ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ట్యాక్స్ వసూళ్ల విషయంలో హాంకాంగ్(13.1%), ఇండోనేషియా(13.1%), మలేషియా(12%)ను ఇండియా వెనక్కి నెట్టిందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడించింది. ‘దేశ ట్యాక్స్-GDP నిష్పత్తి 19.6%గా ఉంది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట, GST, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం వంటివి ఇందుకు కారణం. జర్మనీ-38%, అమెరికా-25.6%తో మెరుగ్గా ఉన్నాయి’ అని పేర్కొంది.

News January 25, 2026

కామారెడ్డి: ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు జిల్లా వాసి

image

నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాజు దేశ రాజధాని ఢిల్లీలో 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. భారత ప్రభుత్వం నుంచి ఆయనకు పిలుపు రావడంతో శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపికయ్యారు. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కమ్మరి రాజు ఒక్కరు ఉండటం విశేషం.