News February 2, 2025

BHPL: రేపటి నుంచి జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్

image

రేపటి నుంచి జిల్లాలోని వివిధ శాఖలతో క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు పోలీసు అధికారులు సిబ్బందికి పలు క్రీడలు నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ క్రీడలు ఈ నెల 3 నుంచి 6 వరకు కొనసాగనున్నాయని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అంబేడ్కర్ స్టేడియంతో పాటు కాకతీయ స్టేడియంలో జరగనున్నాయని చెప్పారు.

Similar News

News November 15, 2025

మేడ్చల్: వరి ధాన్యం కొనుగోళ్లు.. ధరలు ఇవే..!

image

మేడ్చల్ జిల్లా పరిధిలో అనేక చోట్ల వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. అయితే.. మొదటి రగం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి 2,369 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లుగా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సుగుణ బాయి తెలిపారు.రైతులు వరి ధాన్యాన్ని స్థానిక ధాన్యం కేంద్రాల వద్ద విక్రయించుకునే అవకాశం ఉందని తెలిపారు.

News November 15, 2025

HYD: 5 ఏళ్లలో 2 లక్షల కిడ్నీ కేసులు.. జర జాగ్రత్త..!

image

వయసుకు, ఆరోగ్యానికి సంబంధం లేకుండా కిడ్నీ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో HYDలోని ఆసుపత్రుల్లో రెండు లక్షలకు పైగా మంది చికిత్స తీసుకోవడం ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధులకు చికిత్సలు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలు అధికంగా నీరు తీసుకోవడంతోపాటు శారీరక శ్రమ చేయడం, న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

News November 15, 2025

GNT: నేటి నుంచి RTCలో అప్రెంటిస్‌షిప్ దరఖాస్తులు

image

APSRTCలో ITI అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్‌ 15 నుంచి 30 వరకు అభ్యర్థులు www.apprenticeshipindia.gov.inలో నమోదు చేసుకోవాలని RTC సూచించింది. జిల్లాల వారీగా కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో ఖాళీలు ప్రకటించగా, ట్రేడ్ల వారీగా ఎంపికలు జరగనున్నాయి. కాగా పై జిల్లాలో ఉన్న I.T.I. కాలేజీల నుంచి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.