News March 27, 2025
BHPL: సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ తెలిపారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఐకేపీలకు పెండింగ్ కమిషన్ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వివరిచారు.
Similar News
News November 18, 2025
నీటి వాడుక లెక్కలు తేల్చేందుకు AP సహకరించడం లేదు: ఉత్తమ్

కృష్ణా జలాల వినియోగాన్ని తెలుసుకొనేలా టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు AP సహకరించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘నీటిని ఏ రాష్ట్రం ఎంత వినియోగిస్తోందో తెలుసుకొనేందుకు 18 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటుచేశాం. మరో 20 ఏర్పాటుకావాలి. వీటి ఏర్పాటుకు ఏపీ ముందుకు రావడం లేదు. తన వాటా నిధులూ ఇవ్వడం లేదు. స్టేషన్ల ఏర్పాటుకు ఆ నిధులనూ మేమే ఇస్తామని కేంద్రానికి చెప్పా’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
News November 18, 2025
RGM: సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం పరిశీలించారు. గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి బ్రిడ్జి వద్ద, అంతర్గాం మండలం గోలివాడ జాతర నిర్వహణ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర విజయవంతానికి అన్ని విభాగాల అధికారులు సమాయత్తంగా ఉండాలన్నారు.
News November 18, 2025
సాధారణ ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే సేవల నాణ్యత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఫాలోఅప్ను ఆశా కార్యకర్తలతో సమన్వయం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.


