News March 27, 2025

BHPL: సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

సెర్ఫ్ లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ తెలిపారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఐకేపీలకు పెండింగ్ కమిషన్ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వివరిచారు.

Similar News

News November 10, 2025

అందెశ్రీ అస్తమయం.. ఇందూరుతో ప్రత్యేక అనుబంధం

image

జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన ప్రముఖ కవి ‘అందెశ్రీ’కి నిజామాబాద్ జిల్లాతో అనుబంధం ఉంది. అందె ఎల్లయ్య (అందెశ్రీ) కొన్ని సంవత్సరాల క్రితం జిల్లాలోని మాక్లూర్ మండలంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. ఆ సమయంలో అమ్రాద్‌లో శంకర్ మహరాజ్ వద్ద శిష్యరికం చేశారు. ఆ సమయంలోనే సమాజాన్ని అర్థం చేసుకునే తత్వం అలవాటైందని, కవిత్వం సైతం ఇందూరులోనే నేర్చుకున్నానని ఆయన తరచూ చెప్పేవారు.

News November 10, 2025

APPLY NOW: జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలు

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇవాళ్టి వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/

News November 10, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

image

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్‌లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.