News March 20, 2025
BHPL: కుల మతాలకు అతీతంగా.. బడి పంతుల్ల స్నేహం

చిట్యాల మండలంలో జూకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కులమతాలకు అతీతంగా బడిపంతుల్లు స్నేహాన్ని కనబరుచుకుంటున్నారు. ముస్లింకు చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్.రఫీకి రానున్న రంజాన్కు డ్రై ఫ్రూట్స్ అందజేసి విద్యార్థుల ముందు మమకారాన్ని పంచుకున్నారు. తనువుకు ఉత్సాహం ఇచ్చే ఉత్ప్రేరకమే స్నేహం అని నిరూపించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణ, రాధికరాణి, మమత, ఉమాదేవి, రంజిత్ కుమార్, రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News February 22, 2026
తూ.గో: దొంగ నోట్ల ముఠా అరెస్ట్

దొంగ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల్లో శేఖర్, లాగు శ్రీను, బొలిపో తేజలను అదుపులోకి తీసుకుని రూ. 1,45,500 దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లు ఆన్లైన్ మార్గం నుంచి వారికి అందుతున్నాయని కొవ్వూరు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు వారు వెల్లడించారు.
News February 22, 2026
తిరుపతి: B.Ed విద్యార్థిని సూసైడ్

తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే కోడూరులోని రంగనాయకులపేటలో B.Ed చదువుతున్న ఆమంచి భార్గవి (24) ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాద్రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 22, 2026
బానిసత్వ మనస్తత్వం వీడాలి.. దేశ సంస్కృతిని గౌరవించుకోవాలి: మోదీ

బానిసత్వ మనస్తత్వం వీడి భారతీయ సంస్కృతిని గౌరవించుకోవాలని PM మోదీ పిలుపునిచ్చారు. రేపటి నుంచి MAR 1 వరకు రాష్ట్రపతి భవన్లో ‘రాజాజీ ఉత్సవం’ నిర్వహించనున్నట్లు ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్లో తెలిపారు. AI సమ్మిట్ గురించి ప్రస్తావించారు. AIలో దేశ పురోగతి, యానిమల్ హెల్త్ కేర్&అగ్రికల్చర్లో టెక్నాలజీ వినియోగంపై వివరించారు. ఈ నెల 24న TN మాజీ సీఎం జయలలిత జయంతి నేపథ్యంలో ఆమె సేవలను గుర్తుచేశారు.


