News September 10, 2025
BHPL: ‘జాతీయ లోక్-అదాలత్ను సద్వినియోగం చేసుకోండి’

సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. ‘రాజీ మార్గమే.. రాజ మార్గం. రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చు’ అని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు.
Similar News
News September 10, 2025
NTR: పీజీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి 2025లో నిర్వహించిన ఎం.కామ్ 1, 3వ, ఎం.ఏ. రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.
News September 10, 2025
వేములవాడ: ఇంటిపై పిడుగు.. ఉలిక్కి పడ్డ జనం

వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో అకస్మాత్తుగా చిన్నపాటి వర్షంతో పిడుగు పాటు చోటుచేసుకుంది. పిడుగు ఓ ఇంటిపై పడటంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పై భాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడం ఊరట కలిగించింది.
News September 10, 2025
GNT: పీజీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి 2025లో నిర్వహించిన M.com 1, 3వ, MA. రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.