News February 15, 2025
BHPL: నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

2008 డీఎస్సీలో అర్హత సాధించిన ఎస్జీటీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు HNK డీఈవో కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు.ఉమ్మడి జిల్లాలో 295 మంది అభ్యర్థులకు గాను 182 మంది అభ్యర్థులు వెరిఫికేషన్కు హాజరయ్యారు. నేడు BHPL జిల్లాకు చెందిన 8 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. వీరికి నెలకు రూ.31,040 జీతం ఇవ్వనున్నారు.
Similar News
News December 15, 2025
దేశంలోనే వృద్ధ ఎమ్మెల్యే కన్నుమూత

దేశంలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా పేరొందిన శామనూరు శివశంకరప్ప(95) మరణించారు. కర్ణాటకలోని దావణగెరె సౌత్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో మరణించారని వైద్యులు తెలిపారు. 1969లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకరప్ప MPగానూ పనిచేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతిపై పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు.
News December 15, 2025
సిరిసిల్ల: రెండో విడతలో ఎవరికి ఎన్ని సీట్లంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో బోయినపల్లి, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట మండలాలలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 88 గ్రామ పంచాయతీలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 40 స్థానాలలో విజయం సాధించారు. ప్రతిపక్ష భారాస బలపరిచిన అభ్యర్థులు 30 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 6 చోట్ల, సీపీఎం 1, ఇతరులు 11 స్థానాలలో గెలుపొందారు.
News December 15, 2025
సిరిసిల్ల: జీపీ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యేలు

జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగిన 3 మండలాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పట్టు నిలుపుకున్నారు. తంగళ్ళపల్లి మండలంలో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఇల్లంతకుంట మండలంలో అత్యధిక సీట్లు గెలుచుకుని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బోయినపల్లి మండలంలో అత్యధిక స్థానాలు దక్కించుకుని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.


