News January 31, 2025

BHPL: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

image

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,563 మంది విద్యార్థులను గాను రూ.8,96,610 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Similar News

News October 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 42

image

1. వాలి ఎవరి అంశతో జన్మించాడు?
2. కర్ణుడి అంత్యక్రియలను ఎవరు నిర్వహించారు?
3. జ్ఞానానికి, విద్యకు అధిదేవత ఎవరు?
4. త్రిమూర్తులలో ‘లయకారుడు’ ఎవరు?
5. వాయు లింగం ఏ ఆలయంలో ఉంది?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 21, 2025

ఇంటర్‌తో 7,565 పోస్టులు.. అప్లైకి నేడే లాస్ట్ డేట్

image

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి నేడే లాస్ట్ డేట్. 18-25 ఏళ్ల వయసున్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. డిసెంబర్ /జనవరిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News October 21, 2025

ADB: నేటికీ చెదరని జ్ఞాపకాలు!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1983 నుంచి నక్సలైట్ల అలజడిలో ఖానాపూర్ సర్కిల్ పరిధిలో 19 మంది పోలీసులు అమరులయ్యారు. తుపాకీ మోత చప్పుళ్లతో అల్లకల్లోలమైన అప్పటి పరిస్థితులు నేటికీ ఒళ్లు జలదరింపజేస్తున్నాయి. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. అమరవీరుల కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.