News January 31, 2025
BHPL: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,563 మంది విద్యార్థులను గాను రూ.8,96,610 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News March 14, 2025
బాలల హక్కులను వివరించారు: జిల్లా జడ్జి

బాలలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా జడ్జి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో జువైనల్ జస్టిస్ చట్టంపై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాలలపై ఎవరైనా హింసకు పాల్పడితే నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని చెప్పారు. సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్, న్యాయమూర్తులు పాల్గొన్నారు.
News March 14, 2025
కాల్పుల విరమణకు పుతిన్ ఒకే.. కానీ

ఉక్రెయిన్తో యుద్ధంలో 30 రోజుల పాటు <<15729985>>కాల్పుల విరమణకు<<>> రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారు. కాల్పుల విరమణకు అనుకూలమేనని అంటూ చిన్నచిన్న విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయమై మధ్యవర్తిత్వం చేస్తున్న యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ను కలిసి మాట్లాడుతామని చెప్పారు. ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా ముగించే ఆలోచనకు మద్దతిస్తామని పేర్కొన్నారు.
News March 14, 2025
వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.