News April 11, 2025

BHPL: పెద్దవాగుకు జలకళ.. రైతుల పాలిట జలధార

image

మహాముత్తారం మండలంలోని మీనాజీపేట, పెగడపల్లి, కేశపూర్, నిమ్మగూడెం, యాత్నారం, సింగంపల్లి గ్రామాల మీదుగా ప్రవహించే పెద్దవాగు జలకళ సంతరించుకుని రైతుల పాలిట వరంగా మారింది. దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న గొల్ల బుద్ధారం పెద్ద చెరువు అలుగు పారే ఈ పెద్దవాగు. ఈ వాగు సంవత్సరం పొడవునా నీటితో ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల రైతులు వాగుకు మోటార్లు ఏర్పాటు చేసుకుని పంటలు పండించుకుంటున్నారు.

Similar News

News March 1, 2026

43 మందికి రూ.4.30 లక్షల జరిమానా: VZM SP

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని విజయనగరం ఎస్పీ వెల్లడించారు.

News March 1, 2026

సంక్రాంతి తర్వాత డల్ టాలీవుడ్ డల్

image

సంక్రాంతికి కళకళలాడిన టాలీవుడ్ బాక్సాఫీసు ఆ తర్వాత డల్ అయింది. పండగ తర్వాత రిలీజైన తెలుగు సినిమాలు ఆ రేంజ్ ఆదరణ దక్కించుకోలేకపోయాయి. గత నెలరోజుల్లో రిలీజైన 10 సినిమాల్లో ఏ ఒక్కటీ మంచి కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది. పెద్ద సినిమాలు లేకపోవడం, టికెట్ ధరలు, ఓటీటీలకు ఆడియన్స్ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనవి కారణాలుగా తెలుస్తోంది. అయితే ఈనెల, ఏప్రిల్‌లో బడా సినిమాల రిలీజ్‌తో పరిస్థితి మారే అవకాశం ఉంది.

News March 1, 2026

నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.