News February 23, 2025
BHPL: మహా శివరాత్రి.. మరో 3 రోజులే!

శివరాత్రి వేడుకలకు ఓరుగల్లు పెట్టింది పేరు. WGL నగరంలోని వేయి స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టుగుట్ట సహా పలు దేవాలయాలు భక్తులతో పండుగరోజు నిండిపోతాయి. ఐనవోలు(HNK), రామప్ప(ములుగు), కాళేశ్వరాలయం(BHPL), పాలకుర్తి సోమేశ్వర(జనగామ), కురవి వీరభద్రస్వామి(MHBD) దేవాలయాలు జాగారం ఉన్న శివ భక్తులతో కిటకిటలాడతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News February 20, 2026
పార్వతీపురం: ‘ఫీడర్ అంబులెన్స్ సర్వీసుల టెండర్ రెన్యువల్ చేయాలి’

గిరిజన ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్న ఫీడర్ అంబులెన్స్ సర్వీసుల టెండర్ రెన్యువల్ చేయాలని ఫీడర్ అంబులెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బి.ఈశ్వరరావు, ఆర్. రాము డిమాండ్ చేశారు. శుక్రవారం పార్వతీపురంలోని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం పరిపాలన అధికారికి వినతిపత్రం సమర్పించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు.
News February 20, 2026
వాడరేవు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

పిడుగురాళ్ల–వాడరేవు జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పర్చూరు వైపు వస్తున్న కారు- బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పర్చూరు SI పులి గోపి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు తెలియాల్సిఉంది.
News February 20, 2026
వచ్చే నెల కార్పొరేట్ అమెండ్మెంట్ బిల్?

మార్చి 9న ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సెషన్లో కేంద్రం కార్పొరేట్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కంపెనీస్ యాక్ట్ (2013), LLP ACT (2008) చట్టాల్లోని రూల్స్ను ఈ బిల్లుతో సవరించనుంది. సాంకేతికంగా లేదా కార్యకలాపాల్లో జరిగే చిన్న పొరపాట్లపై ఉన్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ను తొలగించనుంది. డిజిటైజేషన్ ద్వారా పర్యవేక్షణ మెరుగవుతుంది. దీంతో వ్యాపార కార్యకలాపాలు సులభతరం కానున్నాయి.


