News February 2, 2025

BHPL: ‘శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి’

image

శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో 7 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశామని, 333 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

Similar News

News November 13, 2025

సీఎం, పీఎంను తొలగించే బిల్లు.. జేపీసీలో మన ఎంపీలకూ చోటు

image

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లుపై కేంద్రం <<18272673>>ఏర్పాటు<<>> చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవకాశం లభించింది. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, జనసేన ఎంపీ బాలశౌరి, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డికి చోటు దక్కింది. కాంగ్రెస్ సహా ఇండీ కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించాయి.

News November 13, 2025

నెల్లూరు: సాయం కోసం 12,293 మంది రైతుల ఎదురుచూపులు

image

అన్నదాత సుఖీభవ కింద ఖాతాలకు జమ కావలసిన రూ.20 వేల కోసం నెల్లూరు జిల్లాలోని 12,293 మంది రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 2 లక్షల మందికి పైగా రైతులకు జమ అయింది. కానీ సాంకేతిక కారణాలతో జమ కాని 12,293 మంది రైతులు సాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు వివాదాల కారణంగా ఆగినవి కాకుండా మిగిలిన అన్నీ కూడా అధికారులు తగిన శ్రద్ధ చూపిస్తే సత్వరమే పరిష్కారం అయ్యేవేనని సమాచారం..

News November 13, 2025

WGL: అన్యాయం అంతరిస్తే ‘నా గొడవ’కు ముక్తి..!

image

‘అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి’ అంటూ ప్రజల గొడవను తన గొడవగా చెప్పిన మానవీయ కవి, ప్రజా కవి కాళోజీ నారాయణరావు. అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, సంపదల్ని ఒకచోట గంపెడు బలగం ఒకచోట అంటూ, సమసమాజ నిర్మాణానికి తన కవితలతో కదం తొక్కిన ఉద్యమవీరుడు ఆయన. కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు.
#నేడు కాళోజీ వర్ధంతి.