News March 7, 2025

BHPL: 20 ఏళ్ల నుంచి చోరీలు.. 36 కేసులు నమోదు

image

2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పలు జిల్లాల్లో 36 కేసులు నమోదయ్యాయని ఏసీపీ కృష్ణ తెలిపారు. ఏసీపీ వివరాలిలా.. భూపాలపల్లి(D) మల్హర్‌రావు(M) రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) చిన్నరాతులపల్లిలో శాంతమ్మ ఇంట్లో బంగారం అపహరించాడు. విచారణ జరిపి అతని వద్ద నుంచి రూ.15.47 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News October 24, 2025

సిద్దిపేటలో ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సులు సేఫేనా..?

image

కర్నూల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, స్కూల్ బస్సులు సేఫేనా అన్న ప్రశ్న ప్రజల ఆలోచనల్లో మెదులుతోంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్ అయ్యారు. ప్రమాదంపై విచారణ జరపాలని ఆదేశించారు. సిద్దిపేట ప్రైవేట్, స్కూల్ బస్సులపై ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలంటున్నారు.

News October 24, 2025

డయల్ 100 కాల్స్‌కు త్వరితగతిన స్పందించాలి: వనపర్తి ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో డయల్ 100 కాల్స్‌కు త్వరితగతిన స్పందిస్తూ, ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యాచరణను అవలంబిస్తూ, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపుమాపేలా కృషి చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా గట్టిగా గస్తీ నిర్వహించాలన్నారు.

News October 24, 2025

ఆస్ట్రేలియా టీ20 జట్టులో భారీ మార్పులు

image

భారత్‌తో ఈనెల 29 నుంచి NOV 8 వరకు జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఆఖరి 3 మ్యాచ్‌లు ఆడనున్నారు. ENGతో యాషెస్ సిరీస్ నేపథ్యంలో హేజిల్‌వుడ్‌ 2, సీన్ అబాట్ 3 మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికయ్యారు. వీరి స్థానాల్ని బియర్డ్‌మ్యాన్, డ్వార్‌షూస్ భర్తీ చేయనున్నారు. కీపర్ జోష్ ఫిలిప్ అన్ని మ్యాచ్‌లూ ఆడనున్నారు.