News April 12, 2025
ఎల్లుండి నుంచి ‘భూ భారతి’ అమలు

TG: భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. భూ భారతి పోర్టల్ను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ పోర్టల్పై ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 20, 2025
నేలలో అతి తేమతో పంటకు ప్రమాదం

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.
News December 20, 2025
పాటియాలా లోకోమోటివ్ వర్క్స్లో 225 పోస్టులు

<
News December 20, 2025
విశ్వాన్ని కాపాడే ఆధారభూతుడు ‘శివుడు’

ఓం స్థాణవే నమః – ‘స్థాణువు’ అంటే కదలిక లేనిది. శివుడు కదలలేక కాదు, తాను కదలడానికి ఖాళీ లేనంతగా అంతా తానై నిండి ఉన్నాడు. అందుకే ఆయన స్థాణువు. చెట్టు మానులాగా నిశ్చలంగా, దృఢంగా ఉండి ఈ విశ్వాన్ని కాపాడే ఆధారభూతుడు ఆయనే. ఎవరైతే ప్రాపంచిక బంధాల మధ్య ఊగిసలాడుతుంటారో, వారికి శివుడు కొమ్మలా ఆసరా ఇస్తాడు. సర్వవ్యాప్తమైన ఆయన అనంత స్థితిని, లోతైన నిశ్చలత్వాన్ని ఈ నామం మనకు చక్కగా వివరిస్తుంది. <<-se>>#SHIVANAMAM<<>>


