News March 26, 2025

ప్రజల కోసమే భూభారతి: పొంగులేటి

image

TG: ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ‘ధరణి ఎజెండాతోనే మేం ఎన్నికలకు వెళ్లాం. ధరణి బాగుందా లేదా అని ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే స్పష్టమైంది. బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టే ఓడించారు. భవిష్యత్‌లోనూ భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూద్దాం’ అంటూ సవాల్ విసిరారు.

Similar News

News October 26, 2025

ప్రెగ్నెన్సీలో పానీపూరి తింటున్నారా?

image

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్‌ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్‌, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్‌ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.

News October 26, 2025

విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. తప్పిన ప్రమాదం

image

సౌదీ అరేబియాకు చెందిన SV340(Boeing 777-300) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. జెడ్డా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్షుల గుంపు ఢీకొట్టింది. అక్కడ పక్షుల రక్తపు మరకలు అంటుకున్నాయి. ముందరి భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సేఫ్టీనే అని పైలట్ నిర్ధారించుకుని ల్యాండ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు గుర్తించారు. పక్షులు ఇంజిన్‌లోకి వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.

News October 26, 2025

‘కాలానమక్’ వరి రకం ప్రత్యేకతలు ఇవే..

image

కాలానమక్ దేశీ వరి రకం పంట కాలం 130 నుంచి 140 రోజులు. 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ బియ్యంలో ఉండే అధిక ప్రొటీన్లు, ఐరన్, జింక్, ఇతర సూక్ష్మపోషకాలు మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యానికి 2013లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఔషద గుణాలు కలిగిన ఈ బియ్యం తినడం వల్ల క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచవచ్చంటున్నారు నిపుణులు.