News March 16, 2024

భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించాలి: కాసోజు శంకరమ్మ

image

ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందని తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Similar News

News September 3, 2025

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్రం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒకేసారి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ పొందుతున్నప్పటికీ, ఈ పథకానికి అర్హులేనని అన్నారు. దరఖాస్తులన్నింటినీ విచారణ చేసి త్వరితగతిన ఆర్డీఓకు పంపించాలని అధికారులను ఆదేశించారు.

News September 2, 2025

గణేష్ నిమజ్జనానికి పటిష్ఠమైన ఏర్పాట్లు: ఎస్పీ

image

వినాయక నిమజ్జనానికి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. నల్గొండలోని వల్లభరావు చెరువు వద్ద గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైటింగ్, బారికేడ్లు, క్రేన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

News September 2, 2025

NLG: విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని HRC ఆదేశం

image

నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాల యాజమాన్యం తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌‌కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ షమీమ్ అక్తర్, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు వారి టీసీ, ఇతర సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.