News March 16, 2024

భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించాలి: కాసోజు శంకరమ్మ

image

ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందని తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Similar News

News January 30, 2026

నల్గొండ: హస్తం పార్టీలో ‘ఏకపక్ష’ రాజకీయం!

image

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక చిచ్చు రేపుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నిబంధనలు పక్కనపెట్టి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతను సంప్రదించకుండానే అభ్యర్థులను ఖరారు చేస్తుండటంతో కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. మంత్రి ఏకచక్రాధిపత్యంపై జిల్లా నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

News January 30, 2026

NLG: నేడే ఆఖరు తేదీ.. రెండు రోజుల్లో 607 నామినేషన్లు

image

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బుధవారం కేవలం 44 నామినేషన్లు మాత్రమే రాగా, రెండో రోజైన గురువారం ఏకంగా 563 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండు రోజుల్లో మొత్తం 607 మంది అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. నామినేషన్లకు నేడే ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలతో తరలివచ్చే అవకాశం ఉంది.

News January 30, 2026

నల్గొండ: బీజేపీ జాబితాలో జాప్యం..

image

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్ల గడువు ముగుస్తున్నా స్పష్టత లేకపోవడంతో ఆశావహులు బీ-ఫాం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కని బలమైన అభ్యర్థులను తమవైపు తిప్పుకుని టికెట్లు కేటాయించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.