News December 2, 2024

2 కేసుల్లో కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష

image

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రకటించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో డెలావెర్, కాలిఫోర్నియాలో అతనిపై కేసులున్నాయి. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, కానీ రాజకీయాల ప్రభావంతో న్యాయం తప్పుదోవ పడుతోందన్నారు. ఓ తండ్రిగా, అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News November 27, 2025

సిరిసిల్ల: కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్ గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్, మీడియా సెంటర్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుల వివరాలను ఆరా తీశారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కచ్చితంగా రికార్డులో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

News November 27, 2025

రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: చంద్రబాబు

image

AP: అమరావతిని రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని CM చంద్రబాబు తెలిపారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును పొడిగించే అంశంపై కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. ‘అమరావతి అభివృద్ధి చెందాలి. ఈ ఫలాలను ఇక్కడి రైతులే ముందు అందుకోవాలి. వారికి న్యాయం చేయడం నా బాధ్యత. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం’ అని రాజధాని రైతులతో మీటింగ్‌లో పేర్కొన్నారు.

News November 27, 2025

ఇక పీరియడ్ బ్లడ్‌తో క్యాన్సర్ గుర్తించొచ్చు!

image

దేశంలో ఏటా 77వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దీనికి కారణం నొప్పిని కలిగించే PAP స్మియర్ వంటి పరీక్షలకు భయపడి మహిళలు చెక్ చేయించుకోకపోవడమే. ఈ నేపథ్యంలో అసౌకర్యాన్ని, అధిక ఖర్చును దృష్టిలో ఉంచుకుని వైభవ్ శితోలే బృందం ‘M-STRIP’ అనే స్వీయ పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేసింది. పీరియడ్ బ్లడ్‌తో పరీక్ష చేసుకుంటే ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి కాపాడుకోవచ్చని చెబుతున్నారు.