News September 22, 2024
చైనాపై బైడెన్ కీలక వ్యాఖ్యలు.. మైక్లో రికార్డ్ అవ్వడంతో చర్చ

క్వాడ్ దేశాధినేతలతో చైనాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన కీలక వ్యాఖ్యలు మైక్లో రికార్డ్ అవ్వడం చర్చకు దారి తీసింది. ‘చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. ఆర్థిక-సాంకేతిక సమస్యలతో సహా అనేక రంగాలలో మనందరినీ పరీక్షిస్తోంది’ అని బైడెన్ చేసిన వ్యాఖ్యలు హాట్ మైక్లో రికార్డ్ అయ్యాయి. దీంతో చైనా తీరుపై అమెరికా గుర్రుగా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైందనే చర్చ నడుస్తోంది.
Similar News
News February 18, 2026
HYD: బాంధవ్య విలువలకు నిదర్శనం

రక్త సంబంధం, అనుబంధం కాలాలు, ఖండాలు దాటించాయి. ప్రాంతాలేవైనా అవి ఎంత బలంగా ఉంటాయో ఈ ఘటనే నిరూపిస్తోంది. బ్రిటన్కు చెందిన రాబిన్ డిక్సన్, తన ముత్తాత లెఫ్టినెంట్ చార్లెస్ విల్సన్ సమాధి కోసం దాదాపు 19ఏళ్ల పాటు వివిధ దేశాల్లో వెతికారు. చివరికి SEC తిరుమలగిరి సెమెట్రీ-12లో ఆ సమాధిని కనుగొన్నారు. ఏళ్లు గడిచినా, వేల మైళ్ల దూరం ఉన్నా వెతుక్కుంటూ రావడం ఆ కుటుంబానికి పూర్వీకులపై ఉన్న గౌరవానికి నిదర్శనం.
News February 18, 2026
బొప్పాయి రోజూ తింటే..

బొప్పాయి అన్ని సీజన్లలో లభించే పండ్లలో ఒకటి. దీన్ని రోజూ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. జీర్ణ సమస్యలు, దృష్టిలోపాలతో పాటు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. వీటితో పాటు అల్జీమర్స్, ఆర్థరైటిస్, డయాబెటిస్, గుండెజబ్బులను దూరం చేయడంలోనూ కీలకంగా పనిచేస్తుంది.
News February 18, 2026
టాప్ 10 ధనిక రాష్ట్రాల్లో AP, TG

FY25లో టాప్ 10 రిచెస్ట్ స్టేట్స్లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. ₹16.41లక్షల కోట్లతో తెలంగాణ ఏడో స్థానంలో, ₹15.93లక్షల కోట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఇక ₹45.32లక్షల కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచినట్లు RBI డేటా వెల్లడించింది. తమిళనాడు (₹31.19L Cr) రెండోస్థానం, యూపీ (₹29.78L Cr) మూడోస్థానంలో నిలిచాయి. ఇక అత్యల్ప GSDP ఉన్న రాష్ట్రంగా ₹4423 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది.


