News March 17, 2024

BIG ALERT.. పరీక్ష తేదీలు మార్పు?

image

ఏపీ ఈఏపీసెట్ తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌పై సందిగ్ధం నెలకొంది. త్వరలోనే కొత్త తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అటు ప్రస్తుతం EAPCET దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా.. ఏప్రిల్ 15 వరకు చేసుకోవచ్చు.

Similar News

News April 20, 2025

IPL: టాస్ గెలిచిన ముంబై

image

వాంఖడేలో MIvsCSK మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో గత నెల 23న ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. దీంతో ఈరోజు పోరు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఐపీఎల్ ప్రియుల్లో నెలకొంది.

జట్లు:
CSK: రషీద్, రచిన్, మాత్రే, శంకర్, దూబే, జడ్డూ, ఓవర్టన్, ధోనీ, నూర్, ఖలీల్, పతిరణ
MI: రికిల్‌టన్, జాక్స్, సూర్య, తిలక్, పాండ్య, నమన్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా, అశ్వని

News April 20, 2025

ఆ సినిమాల్లో యాక్టింగ్ చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది: సామ్

image

తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు పెద్ద పీట వేస్తారని హీరోయిన్ సమంత అన్నారు. తాను నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమాలో అంతా కొత్తవారే నటించారని చెప్పారు. నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సమయంలో యాక్టింగ్ గురించి పెద్దగా తెలియదన్నారు. తాను నటించిన మొదటి రెండు చిత్రాల్లో యాక్టింగ్ చూస్తే ఇప్పటికీ సిగ్గుగా అనిపిస్తుందని సామ్ తెలిపారు. కాగా ‘ఏమాయ చేసావె’తో ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

News April 20, 2025

కుంభమేళాను రాజకీయంగా వాడుకున్నారు: అఖిలేశ్ యాదవ్

image

యూపీలో జరిగిన మహాకుంభమేళాను సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ కుంభ్‌గా మార్చారని SPచీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. బీజేపీ తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థిగా యోగిని ప్రకటించడానికి కుంభమేళాను రాజకీయంగా వాడుకునే ప్లాన్ చేశారన్నారు. ఆ సమయంలో యోగిని PM అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా దాని వెనక బీజేపీ పాత్ర ఉంటుందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

error: Content is protected !!