News March 17, 2024
BIG ALERT.. పరీక్ష తేదీలు మార్పు?

ఏపీ ఈఏపీసెట్ తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్పై సందిగ్ధం నెలకొంది. త్వరలోనే కొత్త తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అటు ప్రస్తుతం EAPCET దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా.. ఏప్రిల్ 15 వరకు చేసుకోవచ్చు.
Similar News
News December 13, 2025
2026లో ఉద్యోగాల జాతర.. RRB క్యాలెండర్ విడుదల

2026 ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్లో గ్రూప్-D నియామకాలు ఉండనున్నాయి.
News December 13, 2025
కస్టమ్స్ కమిషనర్ ఆఫీస్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కోచిలోని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ట్రేడ్స్మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: taxinformation.cbic.gov.in/
News December 13, 2025
పేరు మార్పుతో ప్రయోజనం ఏంటి: ప్రియాంకా గాంధీ

ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా మార్చాలన్న <<18543899>>కేంద్ర నిర్ణయం<<>>పై కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వలన ఏ ప్రయోజనం ఉంటుందో అర్థం కావడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులతో పాటు పత్రాలలో పేరు మార్చాల్సి రావడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఖర్చవుతుందని పేర్కొన్నారు. అనవసర వ్యయంతో ప్రజలకు లాభం ఏమిటని ప్రశ్నించారు.


