News November 8, 2024

BIG ALERT: ఇలా కుటుంబ వివరాలిస్తున్నారా?

image

TG: సమగ్ర కుటుంబ సర్వే కోసం ఫోన్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు ప్రమాదకర లింకులు, ఏపీకే ఫైల్స్ పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని క్లిక్ చేయగానే పౌరుల వ్యక్తిగత సమాచారం వారికి చేరుతోంది. అకౌంట్లలో డబ్బులు ఖాళీ అవుతున్నాయి. కాగా సర్వే సిబ్బంది నేరుగా ఇంటికే వస్తారని, ఎలాంటి పత్రాలు తీసుకోరనే విషయం గుర్తుంచుకోండి. సర్వే పేరిట అనుమానాస్పద లింకులు వస్తే 1930కి కాల్ చేయాలని పోలీసులు తెలిపారు.

Similar News

News February 13, 2026

TU: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్

image

టీయూ కంప్యూటర్ సైన్స్&ఇంజినీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి దుర్గాప్రసాద్‌కు డాక్టరేట్ ప్రధానం చేశారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&మిషిన్ లెర్నింగ్ బేస్డ్ క్వాలిటీ అష్యూరెన్స్ అప్రోచ్ ఫర్ ఈ-లెర్నింగ్ సిస్టమ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై డా.నందిని పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. శుక్రవారం జరిగిన వైవాలో ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌గా జగిత్యాల JNTU ఆచార్య నరసింహ సంతృప్తి వ్యక్తం చేశారు.

News February 13, 2026

బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధరలు

image

AP: ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో <<19090331>>బర్డ్‌ ఫ్లూ బయటపడటంతో<<>> చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ.300పైనే ఉండగా ప్రస్తుతం రూ.160-180కి తగ్గింది. కాగా బర్డ్‌ఫ్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్, కోడి గుడ్లను 100 డిగ్రీలపైన వేడితో ఉడికించి తింటే ప్రమాదం లేదంటున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 13, 2026

దేశవ్యాప్తంగా సిట్టింగ్ జడ్జిలపై 8,630 ఫిర్యాదులు

image

గత దశాబ్ద కాలంలో సిట్టింగ్ జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం ఇవాళ లోక్‌సభలో వెల్లడించింది. ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2024లో మాజీ CJI చంద్రచూడ్, మాజీ CJI సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. పదేళ్ల గణాంకాలు చూస్తే ఎక్కువగా 2022లో 1,012, 2023లో 977, 2024లో 1,170, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయంది.