News October 12, 2024

డిగ్రీ పూర్తైన వారికి BIG ALERT

image

ఏపీలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ఓట్ల నమోదుకు ఈసీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఉమ్మడి తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన డిగ్రీ పూర్తైన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఆధార్, డిగ్రీ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, ఫొటో సహా మరికొన్ని వివరాలను అప్‌లోడ్ చేయాలి. నవంబర్ 6 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 30న ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఓటు నమోదు కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News November 4, 2025

నేటి నుంచి ఈ రాష్ట్రాల్లో ‘సర్’

image

నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 UTల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(<<18119990>>SIR<<>>) ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 4 వరకు ఇది కొనసాగనుంది. DEC 9న డ్రాఫ్ట్ ఓటరు జాబితా, ఫిబ్రవరి 7న ఫైనల్ లిస్టును EC రిలీజ్ చేయనుంది. 51 కోట్ల మంది ఓటర్లు ఇందులో భాగం కానున్నారు. పారదర్శకంగా <<18121229>>సర్<<>> చేపడతామని ఈసీ పేర్కొనగా మరోవైపు ఈ ప్రక్రియను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

News November 4, 2025

పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

image

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.

News November 4, 2025

విశాఖలో భూప్రకంపనలు

image

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.