News March 31, 2024
BIG ALERT: ఈ మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. నిన్న 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 52 మండలాల్లో వడగాలులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 33 మండలాలు, రేపు 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వడగాలుల ప్రభావం ఉండే మండలాల జాబితాను ఇక్కడ <
Similar News
News January 30, 2026
KCRకు ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు ఇచ్చిన సిట్ నోటీసులు చెల్లవని BRS తరఫు లాయర్ మోహిత్ రావు తెలిపారు. CRPC 160 ప్రకారం నోటీసులు ఇవ్వలేరని, గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. 65 ఏళ్లు దాటినవారిని ఇంటి వద్దే విచారించాలని పేర్కొన్నారు. ఇక రాజకీయ కక్షసాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చిందని, అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని మోహిత్ రావు స్పష్టం చేశారు.
News January 30, 2026
చూడి పశువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మిగిలిన పశువుల కంటే చూడి పశువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని బయటకు వదలకుండా కొట్టం దగ్గరే పరిమితమైన వ్యాయామం కల్పించాలి. శుభ్రమైన మేత, తాగునీరు అందించాలి. కొట్టంలో జారుడునేల లేకుండా చూడాలి. ఇతర పశువులతో పోట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు వీటి వెంటపడి పరిగెత్తించకుండా చూడాలి. కాలువలలో దించడం, వాలుగా ఉన్న ఎత్తయిన గట్లు ఎక్కించడం, ఎక్కువ దూరం నడిపించడం చేయకూడదు.
News January 30, 2026
ఫిబ్రవరి 6న OTTలోకి ‘రాజాసాబ్’!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుందని జియో హాట్స్టార్ పేర్కొంది. మొత్తం 4 భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిపింది. భారీ బడ్జెట్తో హారర్ ఫ్యాంటసీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.


