News April 4, 2025

BIG ALERT: పిడుగులతో కూడిన భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో 3 రోజులపాటు విభిన్న వాతావరణం కొనసాగుతుందని APSDMA వెల్లడించింది. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి కాకినాడలో మోస్తరు వానలు, సోమవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంది. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Similar News

News April 11, 2025

గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు

image

TG: యాదాద్రి(D) గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 TMCల నుంచి 1.41 TMCలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా అప్పటి BRS ప్రభుత్వం గంధమల్ల వద్ద 9.86 TMCలతో రిజర్వాయర్ నిర్మించాలనుకుంది. ముంపునకు గురయ్యే 5 గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో 4.28 TMCలకు కుదించింది. తాజాగా INC సర్కార్ 1.41 TMCలకు పరిమితం చేసింది.

News April 11, 2025

జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు: అమిత్‌షా

image

తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి కోసం ఒకే నామినేషన్ దాఖలైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లడంలో అన్నామలై భాగస్వామ్యం విలువైనవని పేర్కొన్నారు. కాగా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో రేపు నైనార్ నాగేంద్రన్‌‌ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది.

News April 11, 2025

నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

image

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక <<16045416>>నిఖిత(17)<<>> అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం గంటల వ్యవధిలోనే నిఖితకు అంత్యక్రియలు జరిపారు. వేరే కులానికి చెందిన అజయ్ అనే యువకుడిని నిఖిత ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇది తెలిసి పేరెంట్స్ ఆమెను మందలించి, అబార్షన్ చేయించారు.

error: Content is protected !!