News April 10, 2025

BIG ALERT: వాట్సాప్‌లో ఇమేజ్ స్కామ్.. ఎలా చేస్తారు?

image

లింక్స్, మెసేజెస్, కాల్స్ ద్వారానే కాకుండా మరో కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. స్కామర్లు వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఫొటోలను పంపుతారు. ఇందులో స్టెగానోగ్రఫీ అనే టెక్నాలజీతో ప్రమాదకర లింక్‌లను యాడ్ చేస్తారు. ఫొటోలను డౌన్‌లోడ్ చేయగానే వారి ఫోన్ క్రాష్ అవుతుంది. సున్నిత సమాచారాన్ని దొంగలించి రిమోట్ యాక్సెస్ చేస్తారు. తాజాగా MPలో ఓ వ్యక్తి ఇలాగే ₹2L పోగొట్టుకున్నాడు.

Similar News

News November 28, 2025

HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య

image

కుమారుడితో కలిసి కట్టుకున్న భర్తనే దారుణ హత్య చేసిందో భార్య. ఈ ఘటన మేడిపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ దేవేంద్ర నగర్‌లో నివసించే బండారి అంజయ్య(55) స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై భార్య, కుమారుడితో నిత్యం గొడవపడేవాడు. గురువారం రాత్రి వివాదం జరగడంతో కుమారుడు, మరొకరితో కలిసి భార్య అతడిని చంపేసింది. కేసు నమోదైంది.

News November 28, 2025

మంచాన్ని గోడలకు ఆనించవచ్చా?

image

మంచాన్ని గోడకు ఓవైపు మాత్రమే ఆనించి ఉంచాలని, అదే శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. మిగిలిన 3 వైపులా వీలైనంత ఖాళీ స్థలం ఉండాలంటున్నారు. ‘మంచంపై నుంచి వ్యక్తులు సులభంగా దిగడానికి, ఎక్కడానికి అనుకూలంగా ఉండాలి. గదిలో ఇరుకు ఉండకుండా, ఏ ఇబ్బంది లేకుండా నడిచేలా స్పేస్ ఉండాలి. దీనివల్ల శక్తి ప్రవాహం పెరుగుతుంది. 3 వైపులా గోడలు ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 28, 2025

వింత ఆచారం.. అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలు

image

తెలంగాణ వినూత్న ఆచారాలకు నిలయం. ఇక్కడ ప్రాంతాలను బట్టి ఆచారాలు, ఆహారపు అలవాట్లూ మారుతుంటాయి. అలాంటి ఓ ఆచారం ప్రకారం పెళ్లిలో అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలను వాడటం కొన్నిచోట్ల కనిపిస్తుంది. జొన్నలను కొన్ని వర్గాల ప్రజలు బియ్యం కంటే పవిత్రంగా భావించి అక్షింతలుగా వాడతారట. ఆదిలాబాద్, వికారాబాద్, వెస్ట్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పలు చోట్ల ఇది కనిపిస్తుంది. మీ ప్రాంతంలో ఈ ఆచారం ఉందా?COMMENT