News April 15, 2025

Big Alert.. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్స్ క్లోజ్

image

సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 6 ప్లాట్‌ఫామ్స్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లకు దాదాపు 120 రైళ్లను మళ్లించనున్నారు. రెన్నోవేషన్‌లో భాగంగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు నిర్మించనున్నారు. 110 మీ. వెడల్పు, 120 మీ. పొడవుతో నిర్మించే స్కై కాంకోర్స్‌లో రిటైల్ ఔట్‌లెట్స్, కియోస్కులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News December 31, 2025

2026లో టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

image

టీమ్‌ఇండియా 2026 జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్‌, 3 మ్యాచుల ODI సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి-మార్చిలో T20 వరల్డ్ కప్, జూన్‌లో AFGతో 3 వన్డేలు, 1 టెస్ట్, జులైలో ENGతో 5 T20s, 3 ODIs, AUGలో SLతో రెండు టెస్టులు, సెప్టెంబర్‌లో AFGతో 3 T20s, WIతో 3 వన్డేలు, 5 T20s, ఆక్టోబర్-నవంబర్‌లో NZతో 2 టెస్టులు, 3 వన్డేలు, డిసెంబర్‌లో శ్రీలంకతో 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది.

News December 31, 2025

మున్సిపాలిటీల గ్రేడ్ పెరిగితే ఏమవుతుందో తెలుసా?

image

AP: EGDt జిల్లా కొవ్వూరు, WGDt జిల్లా తణుకు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీల గ్రేడ్ పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్-1లో ఉన్న తణుకు, గ్రేడ్-2లోని కదిరి మున్సిపాలిటీలను సెలక్షన్ గ్రేడ్‌కు, గ్రేడ్-3లో ఉన్న కొవ్వూరును గ్రేడ్-1కు పెంచింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, కేటాయించే బడ్జెట్ పెరుగుతుంది. రోడ్లు, నీరు, శానిటేషన్ వసతులు మెరుగవుతాయి.

News December 31, 2025

వారికి 16సార్లు న్యూ ఇయర్

image

అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములు 16సార్లు న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారు. గంటకు 28వేల కి.మీ. వేగంతో భూమి చుట్టూ తిరిగే ISS 90 నిమిషాల్లో ఎర్త్‌ని చుట్టేస్తుంది. అంటే రోజులో 16సార్లు భూమి చుట్టూ తిరుగుతూ 45 నిమిషాలకు ఓ పగలు, మరో 45ని.లకు రాత్రిని చూస్తారు. అలా న్యూ ఇయర్‌కూ వీరు 16సార్లు వెల్కమ్ చెబుతారన్నమాట. ప్రస్తుతం ISSలో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు.