News April 15, 2025

Big Alert.. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్స్ క్లోజ్

image

సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 6 ప్లాట్‌ఫామ్స్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లకు దాదాపు 120 రైళ్లను మళ్లించనున్నారు. రెన్నోవేషన్‌లో భాగంగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు నిర్మించనున్నారు. 110 మీ. వెడల్పు, 120 మీ. పొడవుతో నిర్మించే స్కై కాంకోర్స్‌లో రిటైల్ ఔట్‌లెట్స్, కియోస్కులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News January 2, 2026

IPL: గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు

image

IPL మినీ ఆక్షన్‌లో గ్రీన్ (₹25.20Cr), పతిరణ (₹18Cr) అత్యధిక ధర పలికిన టాప్-2 ఆటగాళ్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు రానున్నాయి. ఓవర్సీస్ ప్లేయర్ల ఫీజు విషయంలో <<18572248>>BCCI పెట్టిన లిమిట్<<>> వల్ల గ్రీన్‌కు ₹18Cr మాత్రమే దక్కుతాయి. అందులో IND+AUS ట్యాక్సులు పోగా ఆయనకు మిగిలేది ₹9.9కోట్లే. అటు SL బౌలర్ పతిరణకు ట్యాక్సులు తీసేయగా ₹12.9 కోట్లు మిగులుతాయి.

News January 2, 2026

శబరిమల బంగారం చోరీ.. CBI దర్యాప్తు అవసరం లేదు: కేరళ CM

image

శబరిమల బంగారం చోరీ కేసులో CBI దర్యాప్తు డిమాండ్లను కేరళ CM విజయన్ తోసిపుచ్చారు. SIT దర్యాప్తు సంతృప్తికరంగా జరుగుతోందన్నారు. సాక్ష్యాల ఆధారంగా ఎవరినైనా విచారణకు పిలవచ్చన్నారు. ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మరో జ్యువెలర్, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాశ్, ఆంటోని కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సన్నిహితంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు.

News January 1, 2026

విషపు నీళ్లు!

image

దాహం తీర్చాల్సిన నీళ్లే విషమై ప్రాణం తీసిన <<18729199>>ఘటన<<>> యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. MP ఇండోర్‌లో నీళ్లు కలుషితమై 6 నెలల పసికందు సహా 10 మంది మరణించడం వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. తాగునీటి పైప్‌లైన్‌లో మురికినీరు ఎక్కడ కలుస్తుందో మున్సిపల్ అధికారులు ఇప్పటికీ కనుక్కోలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. 10 రోజులైనా బాధిత ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించలేని దౌర్భాగ్యం.