News April 15, 2025
Big Alert.. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ఫామ్స్ క్లోజ్

సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 6 ప్లాట్ఫామ్స్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లకు దాదాపు 120 రైళ్లను మళ్లించనున్నారు. రెన్నోవేషన్లో భాగంగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు నిర్మించనున్నారు. 110 మీ. వెడల్పు, 120 మీ. పొడవుతో నిర్మించే స్కై కాంకోర్స్లో రిటైల్ ఔట్లెట్స్, కియోస్కులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News April 17, 2025
ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్

హీరోయిన్ జనని నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. పైలట్ సాయి రోషన్ శ్యామ్తో ఎంగేజ్మెంట్ జరిగిందని పేర్కొన్నారు. సంబంధిత ఫొటోలను షేర్ చేశారు. ఈ బ్యూటీ బాలా తెరకెక్కించిన ‘వాడు-వీడు’ మూవీతో తెరంగేట్రం చేశారు. తెగిడి, హాట్ స్పాట్, భగీర, బెలూన్, కాజల్ కార్తీక వంటి చిత్రాల్లో నటించారు. జననికి పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు.
News April 17, 2025
IPL: రాజస్థాన్ కెప్టెన్ రిటైర్డ్ హర్ట్

ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. అతడు 19 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 31 రన్స్ చేసి మంచి ఊపు మీద కనిపించారు. అంతలోనే పక్కటెముల గాయం వేధించడంతో మైదానాన్ని వీడారు. తర్వాతి మ్యాచుకు సంజూ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. సంజూ దూరమైతే మాత్రం రాజస్థాన్కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.
News April 16, 2025
రేపు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం కేసులో రేపు సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు వస్తానని అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. కాగా ఈనెల 18న విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపింది. ఒకరోజు ముందే హాజరవుతానని ఆయన కోరగా అధికారులు సమ్మతించారు. మరోవైపు ఇదే కేసులో ఈనెల 19న విచారణకు హాజరు కావాలని రాజ్ కసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.