News October 19, 2024

BIG BREAKING: సికింద్రాబాద్‌లో లాఠీఛార్జ్.. ఇంటర్నెట్ బంద్..!

image

సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ గుడి వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఒక్కసారిగా వేలాది మంది హిందువులు తరలిరావడం, మసీదు ఉన్న రూట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కాగా పోలీసులపైకి ఆందోళనకారులు కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. దీంతో పోలీసులు ఇంటర్నెట్ బంద్ చేసి వారిపై లాఠీఛార్జ్ చేశారు.

Similar News

News November 20, 2025

మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

image

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

News November 20, 2025

మరోసారి అతిరథ మహారథులతో మెరిసిపోనున్న నగరం

image

భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్‌కు రాష్ట్రపతి నిలయం వేదికకానుంది. 22- 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవ్‌లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్& డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు HYD రానున్నారు. కాగా, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.

News November 20, 2025

HYDలో పక్షులు చూద్దామన్నా.. కనిపించట్లేదు!

image

HYD నుంచి ORR పరిసరాల్లో గతంలో అనేక రకాల పక్షులు కనపడేవి. అయితే ఇటీవల వలస పక్షుల సంచారం గణనీయంగా తగ్గిపోయింది. మారుతున్న వాతావరణం, వేగంగా పెరుగుతున్న పట్టణీరీకరణ, జలవనరుల తగ్గుదల, చెరువులు, కుంటలు తగ్గటం వంటి కారణాలు పక్షుల నివాసాలను ప్రభావితం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడకపోతే జీవ వైవిధ్యం మరింత ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.