News February 16, 2026

BIG BREAKING: కొత్తగూడెం మేయర్‌గా గణేష్ ఎన్నిక

image

కొత్తగూడెం మొట్టమొదటి కార్పొరేషన్ మేయర్‌గా సుజాతనగర్ 21 డివిజన్ కార్పొరేటర్ మూడు గణేష్‌ను సీపీఐ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారికంగా సీపీఐ నేతలు మూడు గణేష్ ఎంపికపై వివరాలు వెల్లడించారు. కాగా ఉపమేయర్ పదవిని కాంగ్రెస్‌కు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే.

Similar News

News February 20, 2026

ధర్మారం: SRSP కాల్వ వంతెనపై యాక్సిడెంట్

image

ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వ వంతెనపై ఓ ఆటో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడి అద్దాలు పగలడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆటో డ్రైవర్ వడ్లూరి చిరంజీవి(36), బైక్‌పై ఉన్న గజ్జెల సురేశ్(35) తీవ్రంగా గాయపడగా, పోలీసులు వారిని చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2026

యంగ్ హీరోతో అనుపమ డేటింగ్?

image

అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌లో వీరిద్దరూ సెల్ఫీ తీసుకోగా దాన్ని ధ్రువ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అనుపమ ఆ పోస్ట్‌ను రీషేర్ చేస్తూ లవ్ సింబల్ జోడించారు. అంతకుముందు ఓ వేడుకలోనూ రాత్రి 2 గంటలకు ఫోన్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీలో ఎవరికి చేస్తారని అడగగా ధ్రువ్‌కి చేస్తా అని అనుపమ చెప్పారు. వీరిద్దరూ గతేడాది ‘బైసన్’ సినిమాలో నటించారు.

News February 20, 2026

చీనీ ధరలు పెంపు.. రైతుల సంతోషం

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.25 వేల ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి రాఘవేంద్ర కుమార్ తెలిపారు. మార్కెట్‌కు మొత్తం 462 టన్నుల దిగుమతి రాగా.. నాణ్యతను బట్టి కనిష్ఠంగా రూ.8 వేలు, సరాసరిగా రూ.17 ధర లభించినట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులతో పోలిస్తే ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.