News February 13, 2026
BIG BREAKING: నిర్మల్లో కాంగ్రెస్ విజయం

నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మొత్తం 42 వార్డులకు గాను 25 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 14 వార్డులు బీజేపీ, ఎంఐఎం 2, BRS 1 వార్డు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక్కడ బీజేపీ MLA మహేశ్వర్ రెడ్డి ఎంత ప్రచారం చేసినా ఆ పార్టీని గెలిపించుకోలేకపోవడంతో స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.
Similar News
News February 14, 2026
కుప్పం DSP పై శాసనమండలి ఛైర్మన్కు ఫిర్యాదు

కుప్పం DSP పై MLC భరత్ శాసనమండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. కుప్పం నియోజకవర్గంలో అత్యవసర ప్రజా ఫిర్యాదులు, శాంతిభద్రతల సమస్యలను చర్చించేందుకు DSPకి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని, ప్రోటోకాల్కు సంబంధించి ప్రభుత్వ స్టాండింగ్ ఆర్డర్లను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తుకు ప్రివిలేజ్ కమిటీని పంపాలని, కుప్పం DSP పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 14, 2026
ప్రొద్దుటూరు: పెట్రోల్ బంక్ స్కాంలో చెక్ బౌన్స్ కేసు.?

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. వీటిపై చెక్ బౌన్స్ కేసు పెట్టనున్నారు. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ ప్రవీణ్ బకాయిలకు సంబంధించి సుమారు రూ.50 లక్షల విలువైన 10 చెక్కులను మున్సిపాలిటీకి జమ చేశాడు. ఈ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయని అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ తెలిపారు. పెట్రోల్ బంక్ బకాయిలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపామని కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు.
News February 14, 2026
శ్రీముఖలింగేశ్వరుని ఉత్సావాల కార్యక్రమాలివే!

శ్రీముఖలింగం దేవాలయం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబు అయింది . ఈనెల15-18 వరకు వేడుకలు జరగనున్నట్లు దేవాదాయ శాఖాధికారులు చెప్పిన విషయం తెలిసిందే. ఆలయంలో 15న మహాశివరాత్రి జాగారం, 16న పడియా, 17న మహా పడియా, 18న వంశధార నదిలో శ్రీముకలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు జరగనున్నాయి. లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్సావాలు విజయవంతమయ్యేలా ఏర్పాట్లను యంత్రాంగం చేపట్టింది.


